Minister Nadendla Manohar: పాకిస్తాన్పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది
ABN , Publish Date - May 13 , 2025 | 10:31 AM
Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ(మంగళవారం) ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) మీడియాతో మాట్లాడారు. దేశ సైన్యానికి దైవ బలం ఉండాలని ప్రార్ధిస్తూ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు భారత సైనికులకు తోడుగా ఉండాలని ఇవాళ దుర్గమ్మకు పూజలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇండియన్ ఆర్మీ ప్రతి అడుగు ముందుకు వేస్తూ.. పాకిస్తాన్ ముష్కరులను అణచివేసేలా చూడాలని దుర్గమ్మను కోరామని అన్నారు. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా జనసేన పనిచేస్తుందని చెప్పారు. అమాయకులైన భారత పర్యాటకులను అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రమూకలు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు మన సైనికులకు అండగా ప్రతి భారతీయుడు నిలిచారని గుర్తుచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ ఉల్లంఘించి తెగబడిందని ధ్వజమెత్తారు. అయినా మన భారత సైన్యం వీరోచితంగా పోరాడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మరోసారి యుద్ద వాతావరణం వచ్చే పరిస్థితి కనిపిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దుర్గమ్మ అనుగ్రహం మన సైనికులకు తోడుగా ఉండాలని వేడుకున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా దైవ బలం మన సైన్యానికి అండగా ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి నేతలు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో పని చేసేలా తమకు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన నేతలు పూజలు చేస్తున్నారని చెప్పారు. చర్చిలు, మసీదుల్లో కూడా సైనికులకు అండగా ఉండేలా ప్రార్ధనలు నిర్వహిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News