Home » ABN Andhrajyothy
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జోసెఫ్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో ఇంజక్షన్తో జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ మాంసం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై జరిపిన మెరుపుదాడుల్లో సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోని రామదుర్గం కొండపై పులి సంచరిస్తోందనే వార్త స్థానికంగా కలకలం రేపింది. పులి సంచరిస్తున్న విషయం తెలియక సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి చెందిన 50 మంది సందర్శకులు విహారయాత్రకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించిన బిల్లుకు లోక్సభలో ఆమోదం పొంది.. రాజ్యసభకు చేరుకుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.
వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది.
ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు ఎండతాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.