Home » Indian Army
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు.
సంతకాలు చేస్తారు తప్ప డెలివరీలు చేయరంటూ భారత వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. ఆయుధాల డెలివరీల విషయంలో ఇదేం పద్ధతి అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన లోగో (Operation Sindoor Logo) భారతీయ సంస్కృతిలోని సిందూరం భావోద్వేగాన్ని చాటింది. అయితే ఈ లోగో ఎవరు రూపొందించారు, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. సింక్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
తాజాగా జోధ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ చిన్నారి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఓ చిన్నారి స్కూల్ యూనిఫామ్ ధరించి శివ తాండవ స్తోత్రాన్ని భావోద్వేగపూరితంగా చెప్పి అందరిలో స్ఫూర్తి నింపింది.
Pawan Kalyan: సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో, దేశం లోపల అంతర్గత భద్రతలో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యమని గతంలో జరిగిన కిరాతక దాడుల్లో తేలిందని చెప్పారు.
పేరుకు కొంతమంది తాము యూట్యూబర్లమని ట్రావెల్ వీడియోలు తీసుకుంటున్నామని చెప్పుకుంటున్నారు. లోపల అంతా గలీజ్ పనులు చేస్తున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నారని పలువురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.