Home » Devotional
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్ష విరమణలు గురువారం నుంచి 5 రోజులపాటు కొనసాగనున్నాయి. 11వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు ఉండటంతో దేవస్థానంపాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు ప్రారంభమయ్యాయి.
గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఈ వనదేవతలకు రెండేళ్లకోసారి మహాజాతర జరగడం సంప్రదాయం. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మహాజాతరగా ఇది ఖ్యాతిని పొందింది.
ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది... అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు మంచి జరుగుతుందని, ఆహ్వానం అందుకుంటారని తెలుపుతున్నారు. మొత్తంగా.. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...
జగన్కు దేవుడన్నా లెక్కలేదని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలన్నా లెక్కలేదని... ఆలయాల పవిత్రత అన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు. పరకామణి దొంగతనం చిన్న దొంగతనం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్తుగొలిపాయని చెప్పుకొచ్చారు.
మేడారంలో వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలు పున: నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గద్దెల పనులపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించింది.
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలని గరికపాటి నరసింహారావు అన్నారు. జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని తెలిపారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.