Srisailam Temple: శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..
ABN , Publish Date - Dec 03 , 2025 | 05:16 PM
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మాల తీయడానికి శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ ఆలయ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
నంద్యాల, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం (Srisailam Bhramaramba Mallikarjuna Swamy Devasthanam) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాన్ని రద్దు చేసింది దేవస్థానం. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.
ఆన్లైన్ ద్వారా భక్తులు భారీగా స్పర్శదర్శనం కోసం నమోదు చేసుకుంటున్నారు. భక్తులు భారీగా తరలివస్తుండటం, మరోవైపు శివస్వాములు కూడా మాల తీయడానికి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో స్పర్శ దర్శనానికి సమయం పడుతోంది. ఈ క్రమంలోనే ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, సాధారణ భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం కంపార్టుమెట్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారాలు, తాగునీరు, తదితర వసతులను ఎప్పటికప్పుడు కల్పిస్తున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు.. వీఐపీలు కూడా పరమేశ్వరుడి దర్శనానికి వస్తోండటంతో పోలీసులు కూడా ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్
తెలుగు తమ్ముళ్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Read Latest AP News and National News