Home » Srisailam
శ్రీశైలంలో డ్యాం నిర్మాణానికి జరిగిన నష్టాన్ని పుణే శాస్త్రవేత్తలు అత్యాధునిక వీడియో కేమెరాలతో విశ్లేషిస్తున్నారు. దీనివల్ల నష్టానికి పూర్తి అంచనా వేసి అవసరమైన మరమ్మతులు చేపట్టడం సులభమవుతుంది.
వానాకాలానికి ముందే ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలోని జలాశయాలకు వరద పోటెత్తుతోంది. వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మే నెలలోనే వరద వచ్చింది.
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 2020 ఆగస్టు 20న జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతికి కారణమైన వారిని తక్షణమే శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికులకు తీపికబురు.
శ్రీశైలం జలాశయం పరిధిలో కేంద్ర జలసంఘం ఐదుగురు శాస్త్రవేత్తల బృందాన్ని పంపి ప్రాజెక్టు పరిస్థితులపై అధ్యయనం ప్రారంభించింది. దెబ్బతిన్న అప్రోచ్ రోడ్, టెయిల్ ఎండ్ ప్రాజెక్టు, ప్లంజ్పూల్ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
శ్రీశైలం జలాశయం మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని జల వనరుల శాఖ చర్యలు తీసుకుంటోంది. ప్లంజ్పూల్ విస్తరణ లేదు, కేంద్రం సూచించిన మార్పులు కోసం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
శ్రీశైల జలాశయానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం నిధులు మంజూరయ్యినా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం లేదు, దానివల్ల నిర్మాణ సంస్థకు రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
శ్రీశైలంలో బుధవారం వడగళ్ళు, గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో చెట్లు కూలిపోవడం, రహదారులు జలమయం కావడం జరిగింది.
శ్రీశైలం డ్యాం రాతి గోడలను పరిరక్షించేందుకు సపోర్టు వాల్స్ నిర్మించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించింది. ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రభావంతో డ్యాం గోడలు దెబ్బతినకుండా శాస్త్రీయ మరమ్మతులు చేయాలని నివేదికలో తెలిపింది.
తెలుగు రాష్ట్రాలకు జీవన రేఖ శ్రీశైలం జలాశయాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉందని.. డ్యాం రాతి గోడలకు సపోర్టు వాల్స్ నిర్మించే మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ సూచించారు.