Home » Pakistan
ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఆసియా కప్ 2025 షెడ్యూల్ రావడంతో క్రికెట్ ప్రపంచం మళ్లీ జోష్లోకి వచ్చింది. ఈ ప్రకటనతో రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తూ లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. రైల్లో కొంత మంది సీట్లలో కూర్చుని ఉండగా.. మరికొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చివరకు అక్కడి దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసిలో జరిగిన భారీ సభలో పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడి చేసే వారు పాతాళ లోకంలో దాక్కున్నా కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఇది అభిమానులకు ఒక భావోద్వేగ పండుగ. అయితే 2025 ఆసియా కప్లో ఈ రెండు జట్ల మ్యాచ్ రద్దవుతుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది.
ప్రపంచ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి భారత జట్టు నిరాకరించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ జర్నలిస్ట్ శిఖర్ ధావన్ను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పాడు.
పహల్గాం దాడికి కారణమైన టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాక్ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు, టీఆర్ఎఫ్ పేరును ఐక్యరాజ్య సమితి ప్రకటనలో చేర్చొద్దని పట్టుబట్టిన ఆయన అమెరికా రంగంలోకి దిగాక యూటర్న్ తీసుకున్నారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి వాడివేడి వాదనలు కొనసాగాయి. కాశ్మీర్ అంశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అస్పష్టత, ఇండస్ నీటి ఒప్పందంపై చర్చలు క్రమంగా తీవ్ర విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.
రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలోని నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడి వరద పరిస్థితులను ఓ జర్నలిస్ట్ లైవ్లో వివరిస్తున్నాడు. అది కూడా పూర్తిగా వరద నీటిలోకి దిగిపోయి.. నీరు మెడ వరకు ప్రవహిస్తుండగా చేతిలో మైక్ పట్టుకుని వివరిస్తున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..