Home » Pakistan
చోటియార్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ మృతదేహాలు కనిపించాయని, పలుచోట్లు బుల్లెట్ గాయాలుండటంతో ఒకే సమయంలో ఈ కాల్పులు జరిగినట్టు అనుమానిస్తున్నామని జిరాయత్ డిప్యూటీ కమిషనర్ జకావుల్లా దుర్రాని తెలిపారు.
పహల్గాం దాడి అనంతరం పాక్ ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు ఖవాజా మహమ్మద్ అహ్మద్ సూటిగా సమాధానం చెప్పకుండా, అమెరికా, బ్రిటన్, పశ్చిమా దేశాల కోసం మూడు దశాబ్దాలుగా చెత్తపనులన్నీ చేశామని ఇటీవల వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఇదే సమయంలో టర్కీ..పాకిస్తాన్కు సాయం చేసిందన్న ఆరోపణలపై టర్కీ తాజాగా స్పందించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు హషీమ్ మూసా..పాక్ మాజీ పారా మిలిటరీ కమాండో అని నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. గతేడాది జరిగిన ఉగ్రఘటనల్లోనూ అతడు పాలుపంచుకున్నట్టు వెల్లడించాయి.
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ ద్వారా పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్యపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు వెళ్లిపోయారు. పాకిస్థాన్ షార్ట్ టర్మ్ వీసా దారులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసుల నోటిసులు పంపారు. పోలీసుల నోటిసులు, కేంద్ర ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్లో నలుగురు పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోయారు. మెడికల్ వీసా మీద వచ్చిన వారికి మంగళవారం వరకు మినహాయింపు ఇచ్చారు.
ధర్మవరంలో నివసిస్తున్న రంశా రఫీక్ పాకిస్థాన్ పౌరసత్వంతో 19 ఏళ్లుగా లాంగ్ టర్మ్ వీసాపై ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పౌరసత్వ దరఖాస్తు పెండింగ్లో ఉంది.
పాకిస్థాన్ అభివృద్ధిలో అర్ధ శతాబ్దం వెనకపడిందని, వారి బడ్జెట్ భారత్ రక్షణ వ్యయం అంత కూడా కాదని ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదంపై పాక్ నేతల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు