Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలో ప్రదర్శించనున్నారు.
పీఎస్సార్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హాయ్ ల్యాండ్లో జరిగిన గ్రూప్ -1 పేపర్ మూల్యాంకనం గుట్టు రట్టు చేసే దిశలో ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
అతను వాలీబాల్ ఆటగాడు. అంతకంటే ముఖ్యంగా ఓ మాజీ రౌడీషీటర్. ఓ ఫుట్బాల్ ఆటగాడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతనిపై పోలీసులు రౌడీషీట్ తొలగించడంతో పేట్రేగిపోతున్నాడు. గన్నవరంలోని సూరంపాలెంలో మామిడి తోటలే కేంద్రంగా డెన్ను ఏర్పాటుచేసుకుని బెట్టింగులతో పాటు కోడిపందేలు, పేకాట, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.
వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీమంత్రి కొడాలి నాని సాగించిన మరో ధనకార్యం వెలుగులోకి వచ్చింది. గుడివాడ మండలం లింగవరం గ్రామంలో కొడాని నానీకి చెందిన ఓ వెంచర్కు నయాపైసా చెల్లించకుండా అప్పన ంగా విద్యుత శాఖ నుంచి రూ.30 లక్షలు ఖర్చు చేయించారు. స్థానిక ఏడీఈ, ఈఈ సహకారంతో అప్పట్లో పనులు చేయించుకున్న గడ్డంగ్యాంగ్ ఇప్పటి వరకు ఆ సొమ్మును చెల్లించలేదు.
కృష్ణాజిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్గా విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అధిష్ఠానం నుంచి సోమవారం ఆయనకు సమాచారం అందటంతో నెట్టెం మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాదాలకు దూరంగా ఉండటం, సమర్థనీయతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కావడం, చంద్రబాబుతో ఉన్న అనుబంధం, గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు విజయం చేకూర్చడంలో కీలకపాత్ర పోషించినందుకే నెట్టెంను ఈ పదవి వరించింది.
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు కౌంట్డౌన్ మొదలైంది. వచ్చేనెల 2వ తేదీన వెలగపూడిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననుండటంతో సభా ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.
Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.
మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు...
మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.
CID Custody: ముంబై నటి జెత్వానీ అక్రమ అరెస్ట్, నిర్బంధం కేసుకు సంబంధించి పీఎస్ఆర్ ఆంజేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.