జరీబు, గ్రామ కంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఇప్పటి వరకూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయిందన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.
రాజధానిలో భూములిచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. 2004 మంది ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది.
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో పవన్ సమావేశమై.. వారిని సత్కరించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
ఫైళ్ల పరిశీలన, పరిష్కారంలో కృష్ణాజిల్లా యంత్రాంగం ముందు వరసలో నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కాస్త వెనుకబడింది. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ ఒక్క రోజులోపే తన దగ్గరకొచ్చిన ఫైళ్లను పరిశీలించి పరిష్కరిస్తుంటే, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాత్రం 8 రోజులకు పైగా సమయం పడుతోంది.
ఇంద్రకీలాద్రిపై భవానీల సంబరం ఆరంభమైంది. ఐదు రోజులు జరిగే భవానీ దీక్షల విరమణ ఉత్సవాలు గురువారం జరిగిన అంకురార్పణతో మొదలయ్యాయి. మొదటిరోజే ఇంద్రకీలాద్రి చుట్టుపక్కల ఎటుచూసినా సిందూర ఛాయలు కనిపించాయి.
నాణ్యతతక్కువగా ఉన్న పత్తిని కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా రైతులను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కార్పొరేట్ సంస్థల కంటే కఠినమైన నిబంధనలతో వ్యాపారాన్ని సాగిస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది.
ఏపీ ఫైబర్నెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాఖలైన ప్రొటెస్ట్ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది.