Deputy CM Pawan: కూర్మగ్రామంలో అగ్నిప్రమాద ఘటనపై లోతైన విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ఈ ఘటన దురుదృష్టకరమన్నారు.
వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులు రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంచనాల రూపకల్పనలో ఆలస్యమవుతోంది. ఫలితంగా ఇంతవరకు నిధులు విడుదల కాక, మరమ్మతులకు నోచుకోక, సాగు చేపట్టాలా లేదా అనే మీమాంసలో ఆయకట్టు అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.
మైలవరంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి వెళ్లిపోయిన తండ్రి వేములవాడ రవిశంకర్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలిద్దరికీ విషమిచ్చి చంపాలని ముందే రవిశంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అమ్మ కళ్లలో ఆనందం కనిపించింది. విద్యార్థులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. కూటమి సర్కారు కొలువు తీరిఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలవడంతో అంతటా తల్లికి వందనం సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లలున్న తల్లుల ఖాతాల్లో కూడా రూ.39 వేలు, రూ.52 వేలు జమ అవుతుండటంతో రెండు జిల్లాల్లో ఎక్కడచూసినా ఇదే చర్చ జరుగుతోంది.
ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.
Supreme Court: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఏ2గా ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Talliki Vandanam Scheme: తల్లికి వందనం నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం నిధులు విద్యార్థిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది సర్కార్.
Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పలువురు మొబైల్ డిస్బర్స్మెంట్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు ఆ వాహనాలను అమ్మకానికి పెట్టారు. సెకండ్హ్యాండ్ వస్తువుల సేల్స్ నిర్వహించే ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫాంలో సెకండ్ సేల్స్ కింద వీటిని విక్రయిస్తున్నారు.
40 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలకు తరలివచ్చారు. అలాగే, బదిలీలు, పదోన్నతుల అనంతరం వివిధ పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులు వచ్చారు.