Home » Deputy CM Pawan Kalyan
ఏనుగుల ముప్పును నియంత్రించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో చిత్తూరులో ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రజలకు, ఏనుగులకు హాని జరగకుండా అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు తీసుకోనున్నారు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళా ఉపాధి శ్రామికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆయా గాయపడినవారికి ఆర్థిక సహాయం కూడా అందించాలని చెప్పారు
Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే వ్యక్తి ఏనుగుల దాడిలో మృతిచెందారు. ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Pawan on Pahalgam Attack: ఏ ధర్మాన్ని ఆచరిస్తారని తెలుసుకుని హతమార్చారంటే ఎంతటి దారుణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జరిగిందో వారు చెబుతుంటే తనకే పేగులు మెలబెట్టినట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని గాంధీజీ చెప్పేవారని, తాను నగరాల్లో ఉన్నా.. పల్లెల్లో ఉండాలనే కోరిక ఉండేదని డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్లెల అభివృద్ధి ఎంతో కీలకం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు వాటికే ఖర్చు చేయాలని చెప్పానని.. అలాగే అమలు చేస్తున్నానని చెప్పారు.
Pawan Kalyan: జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పలువురిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు.
Pawan Kalyan wishes on Purandeswari: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పురందేశ్వరికి బర్త్ డే విషెస్ తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వజ్రోత్సవ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Pawan Kalyan:సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. అల్లూరి జిల్లా ప్రజలకు అండగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజనులకు చెప్పులు లేని విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు వారికి చెప్పులు పంపించి తన గొప్ప మనస్సును పవన్ కల్యాణ్ చాటుకున్నారు.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికసిత్ భారత్కు కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం నిధుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.