Share News

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

ABN , Publish Date - May 05 , 2025 | 02:49 PM

MP Arvind: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు
MP Dharmapuri Arvind

నిజామాబాద్: కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఒక్కటేనని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు ఒకే కంపెనీకి చెందిన డైరెక్టర్లలాంటి వారని విమర్శలు చేశారు. ఇవాళ(సోమవారం) జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌లో పసుపు పరిశ్రమను ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.


రైతులు సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీలు ఇస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. దేశంలోనే నిజామాబాద్ ప్రాంతంలో ప్రగతిశీల రైతులు ఉన్నారని అన్నారు. ప్రతి పంటపై అవగాహన కలిగి ఉన్నారని చెప్పారు. కో ఆపరేటివ్ సెక్టార్‌లో ఏర్పడే పరిశ్రమలకు ఇందూరు ప్రాంతం ఎంతో అనుకూలమని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు లక్ష కోట్ల నిధులు మంజూరు చేస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులను వెంటనే పంపించి వేయాలని ప్రభుత్వాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు.


బోధన్ రోహింగ్యాలకు అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనదేశానికి జగద్గురువు అని అభివర్ణించారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఇందూరు సెగ్మెంట్‌లో బీజేపీకి 70 శాతం ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏనాడైనా ముస్లింలు బీజేపీకి ఓట్లు వేస్తారా అని ప్రశ్నించారు. హిందూ ప్రాణాలకు లెక్కేలేదని చెప్పారు. తెలంగాణలో పాకిస్తానీయులు ఒక్కరూ కూడా ఉండవద్దని అన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది పడుతోందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Uttam: ఏపీ నీటి దోపిడీకి బీఆర్‌ఎస్‌ మద్దతు

72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

Harish Rao: డిగ్రీ పరీక్షలు చేపట్టకపోవడం ప్రభుత్వ అసమర్థత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 05 , 2025 | 03:03 PM