Home » Congress
గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే పై చేయిగా ఉంది. తొలివిడతలో జరిగిన రంగారెడ్డి జిల్లాలో పంచాయతీల్లో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రె్సదే పైచేయి అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న పట్టును నిలబెట్టుకుంటూ మెజారిటీ సర్పంచ్ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకుంది.......
రూ.500 కోట్ల సూట్కేసు ఇచ్చే వాళ్లెవరైనా పంజాబ్ ముఖ్యమంత్రి కావచ్చంటూ నవజ్యోత్ కౌర్ గత శనివారంనాడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు.
లోక్సభలో వందేమాతరం గేయంపై చర్చ జరగడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. బీజేపీ ఎంపీలు పదే పదే ఆ విషయమై చర్చించడం.. బెంగాల్లో రాబోయే ఎన్నికలకు ఆజ్యం పోసినట్టుందని విమర్శించారు.
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరును నవజ్యోత్ కౌర్ ప్రస్తావిస్తూ, ఐదుగురు నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందున వారు సిద్ధూకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సమావేశానంతరం సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని గిరీష్ కలవడంతో అన్ని ఊహాగానాలకు తెరపడినట్టేనని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య పటిష్టమైన పొత్తు ఉందని, కలిసికట్టుగా గతంలో ఐదు ఎన్నికలు గెలిచామని చెప్పారు. తమది 'విన్నింగ్ అలయెన్స్' అని అభివర్ణించారు.
సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా డీకే-డీకే అంటూ నినాదాలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ఎంసీడీ ఉప ఎన్నికలు రావడంతో ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు ఇది పరీక్షగా అందరూ భావించారు. అయితే ఆమె సునాయాసంగా ఈ పరీక్షలో నెగ్గారు.
తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేచయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.