Home » Congress
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోయినా మాట్లాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నేడు విద్యారంగం నాశనమైందనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని, ఆ మేరకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవుల పంపిణీ జరుగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.
కేటీఆర్ అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. త్వరలో అంబులెన్స్ల స్కాం వెలుగులోకి రాబోతోందని చెప్పారు.
కేటీఆర్ భాషను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. అమెరికాలో చదివి, ఉద్యోగం చేసి వచ్చిన కేటీఆర్ భాష విని వీధి రౌడీలు సైతం సిగ్గుపడతారన్నారు.
Chamal Kiran Kumar: కమిషన్ ముందు వన్ టూ వన్ మాత్రమే సమాధానం చెప్తానని కేసీఆర్ ఎందుకు అన్నారని.. వన్ టూ వన్ మాట్లాడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో కేటీఆర్ చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
TG News: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. శాఖల కేటాయింపుపై బుధవారం స్పష్టత రానుంది.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
Congress: మంత్రి పదవులే కాదు.. శాఖల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయంకు ప్రాధాన్యత నివ్వాలని కాంగ్రెస్ అధిష్టానం పేర్కొంది. కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదంటూ ఇప్పటికే కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి నివేదించారు. అలాగే మంత్రుల పనితీరుపై ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు.