Home » Congress
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమని, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని లూటీ చేసిన ఆయన.. ఇప్పుడు తమపై నిందలు వేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
అంబేద్కర్ను అవమానపరిచింది.. అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సత్య కుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ని ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ లిక్కర్ దందాలు చేసే కవితకు, త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ పేరెత్తే నైతిక అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోపిడీకి కేరాఫ్ అడ్రస్గా ఉండడంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
BRS Vs Congress: రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.
CM Revanth Reddy: ఉగ్రదాడికి నిరసనగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం నాడు హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీ తీయనున్నారు. ఈ ర్యాలీలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమరవీరులకు నేతలు నివాళి అర్పించనున్నారు.