• Home » TG Politics

TG Politics

Minister Uttam: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

Minister Uttam: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

Minister Konda Surekha: నాంపల్లి కోర్టు కేసుపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

Minister Konda Surekha: నాంపల్లి కోర్టు కేసుపై స్పందించిన మంత్రి కొండా సురేఖ

నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌర‌వ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాల‌ని స్ప‌ష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్య‌వ‌స్థ మీద అపార‌మైన గౌర‌వం ఉందని చెప్పుకొచ్చారు.

CM Revanth on MODI: కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

CM Revanth on MODI: కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

బ్రిటిష్ పాలకులను తరిమికొట్టిన పార్టీ కాంగ్రెస్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ అని నొక్కిచెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్‌ అని అభివర్ణించారు. బీజేపీ‌తో సహా అన్ని పార్టీలు అధికారంలో లేకపోతే ఇంటికే పరిమితమని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం.. ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం

Minister Uttam: బనకచర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం.. ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం

బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.

Kishan Reddy:  బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Kishan Reddy: బీసీ రిజర్వేషన్‌లు తగ్గించేందుకు కాంగ్రెస్ కుట్ర.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Mahesh  Goud Fires on KCR:  ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్  గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Mahesh Goud Fires on KCR: ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.

Minister Prabhakar: చర్చకు రండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్  ఓపెన్ ఛాలెంజ్

Minister Prabhakar: చర్చకు రండి.. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ ఛాలెంజ్

తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్

Mahesh Kumar Goud: బనకచర్ల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది.. మహేష్ గౌడ్ ఫైర్

బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు.

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి

Somireddy: తెలుగువారు బాధపడేలా మాట్లాడకండి: సోమిరెడ్డి

తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారని, తామేమైనా అభ్యంతరం చెప్పామా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ బాగుంటే తాము ఆనందిస్తామని వ్యాఖ్యానించారు.

Minister Thummala Nageshwar Rao : బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్..

Minister Thummala Nageshwar Rao : బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల కౌంటర్..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కౌంటర్ ఇచ్చారు. పంటల కాలాలు, ఎరువుల కేటాయింపు, సరఫరాలపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి