కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం చిన్న గోకుల్ తండా వాసులు ఎన్నికలను బహిష్కరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా పెద్ద గోకుల్ తండా వాసులు సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకున్నారని గ్రామస్తులు నిరసనకు దిగారు.
బాన్సువాడ మండలంలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది. గుప్త రాజకీయ కదలికలు, కోవర్టు కార్యకర్తల వ్యూహాలతో సర్పంచ్ అభ్యర్థులు ఆందోళనలో పడుతున్నారు. బలం, బలహీనతల సమాచార సేకరణ, రహస్య మీటింగ్స్ గ్రామాల్లో చర్చనీయాంశంగా మారాయి.
హిందూ దేవుళ్లపై రేవంత్రెడ్డికి ఎందుకంత కోపమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్రెడ్డి అన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు.
ప్రేమించి మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా దొంచందకు చెందిన శ్రీకాంత్రెడ్డి, ఏరుగట్లకు చెందిన ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో పడ్డారు. ఇరువురూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని జేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. పావలా వడ్డీకి కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్లకు అభివృద్ధి పనులు చేయడానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వాట్సప్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.6 లక్షల నగదును పోగొట్టుకున్నాడు.
ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఎవరిని ఉద్దేశిస్తూ కవిత ఈ ట్వీట్ చేశారన్నది తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లాలో ఓ పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఓ చేయి, మరో చేతి వేళ్ళు, తల తొలగించి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.