Home » BRS
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న హైదరాబాద్లో విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొంది.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు.
ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. పొంగులేటి అవినీతి మొత్తం సాక్ష్యాలతో సహా హరీశ్ రావు బయటపెట్టారని ఆయన తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మె్ల్యేలందరిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మత్తు వదిలించుకోవడానికే మైదానంలోకి రమ్మంటున్నామని ఎద్దేవా చేశారు.
పార్టీ మారలేదని చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు.
బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.