Home » BJP
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ ఆరోపించారు.
రాష్ట్రంలో పాఠశాల, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాల్లో ‘హిందూ’ అనే పదాన్ని తొలగించడం సరికాదని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోవై వెస్ట్ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తనకు రక్షణ కల్పించాలని బీజేపీ గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ కోరారు. శుక్రవారం మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ నుండి రాష్ట్రంపై పెత్తనం చెలాయించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సేలంలోని మోహన్కుమారమంగళం ప్రభుత్వ వైద్యకళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రూ.880 కోట్లతో నిర్మించనున్న జౌళి పార్కుకు, రూ.100 కోట్లతో నిర్మించనున్న కొత్త గ్రంథాలయ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉండే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా ఆయనకు షాకిచ్చారు. ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని ఈపీఎస్ చెబుతుండగా.. ‘అవునవును.. సంకీర్ణ ప్రభుత్వం కాదు, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ అన్నామలై వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాకగ.
Raja Singh statement: తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనన్న విషయం వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అన్నారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి ప్రకటనలపై వున్న శ్రద్ధ విద్యారంగం పట్ల లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ విమర్శించారు. ఆయన మంగళవారం తన ఎక్స్పేజీలో అర్హులైన సెకండ్ గ్రేడ్ టీచర్లకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా..? లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.