Bandi Sanjay: సీఎం రేవంత్రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయింది.. బండి సంజయ్ ఫైర్
ABN , Publish Date - May 06 , 2025 | 12:31 PM
Bandi Sanjay: సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ కల్చర్ అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజన్న సిరిసిల్ల: సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ప్రభుత్వం చివరి దాక ఉంటుందా అని ప్రజల్లో చర్చ మొదలైందని బండి సంజయ్ కుమార్ చెప్పారు.
భవిష్యత్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ కల్చర్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులు ఎత్తేస్తావా అని నిలదీశారు. కేసీఆర్ అప్పులు చేసిండని ఎన్నికల్లో చెప్పలేదా.. అప్పులు ఉన్నాయని తెలిసి హామీలు ఎందుకు ఇచ్చావని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రజలతో కలిసి వారిని నిలదీస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అర్హుడు కాదు: ఎంపీ ఈటెల రాజేందర్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అర్హుడు కాదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులకు, తెలంగాణ సమాజానికి సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదా నైతిక బాధ్యత వహించి ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని కోరారు. ఏబీఎన్తో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టడానికి పదేళ్లు పడితే రేవంత్ ప్రభుత్వానికి కేవలం పదినెలలు మాత్రమే పట్టిందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. నిజాం నవాబు కాలం నుంచి తెలంగాణ గొప్ప రాష్ట్రమని అన్నారు. పరిపాలించే సత్తా లేక కో ఆర్డినేషన్ సరిగా లేక ఇష్టం వచ్చినట్లుగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడితే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తెలంగాణ తొలి ఆర్థిక శాఖ మంత్రిగా తాను చెబుతున్నానని... ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమేనని ఉద్ఘాటించారు. రేవంత్రెడ్డికి చేతకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP: టీడీపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత
GV Babu: అనారోగ్యంతో బలగం నటుడు.. సహాయం కోసం ఎదురు చూపు..
Helicopter Ride: సరస్వతి పుష్కరాల్లో ‘జాయ్ రైడ్’
NEET: మార్కులు తగ్గినా.. సీటు గ్యారంటీ
Read Latest Telangana News And Telugu News