Home » CM Revanth Reddy
కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు.
పరిపాలన చేతకాని సీఎం రేవంత్రెడ్డి ఫార్ములా ఈ నోటీసుల పేరిట జోకర్లా నాటకాలాడుతున్నారని, హామీలు అమలు చేయలేక ప్రజలదృష్టిని మళ్లించేందుకే పూటకోవిధంగా కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. విద్యా ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో 20 మంది కన్నా ఎక్కువ విద్యార్థులు ఉన్న చోట్ల కొత్త బడులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. అనేక ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి పిటిషన్లు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ రెండు వేర్వేరు కేసుల్లో విచారణను హైకోర్టు 20వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకీ ఆయా కేసుల వివరాల్లోకి వెళ్తే..
'నేను నగదు బ్యాగ్లతో దొరికిన దొంగను కాదు.. న్యాయమూర్తి, మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షలో పాల్గొందాం.. వచ్చే ధైర్యం రేవంత్కు ఉందా?' అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. పదే పదే విచారణలతో ప్రజాధనం ఎందుకు వృథా చేస్తారంటూ ప్రశ్నించారు.
రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.