Home » TG Govt
భారీ స్థాయిలో ఐఏఎస్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నేడో రేపో ఐపీఎస్ల బదిలీలకు సంబంధించిన ఉత్తుర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.
తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్, టారనిస్ క్యాపిటల్ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత పాటించిన కాంగ్రెస్ పార్టీ.. టీపీసీసీ పదవుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకూ తగిన ప్రాధాన్యం కల్పించింది. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
Maganti Gopinath funeral: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. మరోవైపు ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్ధి దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్లోని మాగంటి నివాసానికి తరలించారు.
కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలాడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్కు వెంటనే రిపేర్లు చేసి నీళ్లివ్వాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు. ఈనెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి కళ్లు తిరిగి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో పడిపోయారు.