Home » Congress Govt
ఐవీఎఫ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. గులాబీ నేతలు పబ్లిసిటీ కోసం మాత్రమే తమ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.
బీసీల మెడలు కోసేలా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం అన్యాయమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని ఉద్ఘాటించారు. గత 70 ఏళ్లలో కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కులగణన చేయని కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ పార్లమెంట్ ముందు ముక్కు నేలకు రాయాలని కిషన్రెడ్డి విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ దోషి అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేసి తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రేషన్ కార్డులు రాని పేదలు దరఖాస్తు చేసుకుంటే పార్టీలకు అతీతంగా అందజేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో రోడ్లు, విద్యుత్, ఇతర సమస్యలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కరిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
బనకచర్ల ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకట్ట వేశామని గుర్తుచేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై ఉత్కంఠ నెలకొంది. రేపటితో జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ముగియనుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది. రేపు ఫైనల్ రిపోర్టుపై పీసీ ఘోష్ సంతకం చేయనున్నారు. ఆగస్టు 1వ తేదీ లేదా 2వ తేదీన ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్ అందజేయనుంది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భర్తీ చేయని పోస్టులని భర్తీ చేసేలా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణలోని కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ బోర్డుల్లో డైరెక్టర్లు, మెంబర్ల నియామకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.