Home » Congress Govt
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు.
పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.
విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు.
తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్లే విద్యార్థులను కూడా మోసం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు.
రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేశారు. తొలివిడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు.
రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.