హైదరాబాద్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ మాంసం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గోదాములపై జరిపిన మెరుపుదాడుల్లో సుమారు 10 టన్నుల కుళ్లిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటూ.. మరోవైపు 15 లక్షల కార్డులు తొలగించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్లో ఏప్రిల్ 2న హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
జూబ్లీహిల్స్లో వెలుగులోకి వచ్చిన జంట హత్యల కేసు నగరాన్ని కుదిపేసింది. ఓ సైకో కిల్లర్ కేవలం రూ.26,500 కోసం ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఘటన షాకింగ్గా మారింది.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్కు దివంగత మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై ఉప్పల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో 6 గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రామచందర్రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు.
వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసింది. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా? అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.