ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రభాకర్రావు కీలకంగా ఉన్నారు. ఆయనను విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఐ బొమ్మ రవి కస్టడీకి ఎక్కువ సమయం ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవరం విచారణ జరిగింది.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకున్న అఖిలేశ్.. యాదవ సంఘాల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉన్నా యాదవులంతా ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. దాంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచక పర్వాన్ని ఎదుర్కొన్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా గులాబీ సైనికులందరికీ ఆయన ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాసులు లేని వారు స్టేడియం వద్దకు రావద్దన్నారు. అలాగే ఆలస్యంగా వచ్చే వారిని స్టేడియంలోకి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు.
అఖండ-2 చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డిసెంబర్ 14వ తేదీ వరకు డివిజన్ బెంచ్ స్టే విధించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వారం రోజుల్లో అపాలజీ చెప్పాలని.. లేదంటే కోర్టుకి ఈడుస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ను ఒక్క సహాయం కూడా అడగలేదని తెలిపారు.