Rare Animal: ఢిల్లీలో అరుదైన జంతువు.. 80 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
ABN , Publish Date - May 21 , 2025 | 05:06 PM
యమునా నది మైదాన ప్రాంతంలో బూడిద రంగులో ఉండే తోడేలును తచ్చాడుతుండగా.. ఓ వ్యాపార వేత్త దాన్ని చూసి ఫొటోలు తీశాడు. అయితే దీన్ని పరిశీలించిన నిపుణులు.. ఈ బూడిద రంగు తోడేలు చాలా అరుదుగా కనిపిస్తుంటుందని తెలిపారు. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ తోడేలు కనిపించినట్లు చెబుతున్నారు..

భూమిపై చాలా జంతువులు అంతరించిపోతుండడం చూస్తున్నాం. అయితే ఎప్పుడో కనిపించకుండా పోయిన కొన్ని జంతువులు అప్పుడప్పుడూ తారసపడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా, ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. బూడిద రంగు తోడేలును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి తోడేలును చూస్తున్నామని చెబుతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలోని (Delhi) పల్లా సమీపంలోని యమునా నది (Yamuna River) పరీవాహక ప్రాంతంలో అరుదైన జంతువు కనిపించింది. యమునా నది మైదాన ప్రాంతంలో బూడిద రంగులో ఉండే తోడేలు (Gray wolf) తచ్చాడుతుండగా.. ఓ వ్యాపారవేత్త దాన్ని చూసి ఫొటోలు తీశాడు. అయితే దీన్ని పరిశీలించిన నిపుణులు.. ఈ బూడిద రంగు తోడేలు చాలా అరుదుగా కనిపిస్తుంటుందని తెలిపారు. 80 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ తోడేలు కనిపించినట్లు చెబుతున్నారు. 1940లలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ తోడేలు సంచరించేదని చెబుతున్నారు.
Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..
హేమంత్ గార్గ్ అనే వ్యాపారవేత్త గురువారం ఉదయం వాకింగ్కు వెళ్తుండగా.. నది ఒడ్డున ఈ తోడేలు కనిపించింది. చూడటానికి విచిత్రంగా ఉండడంతో పాటూ దీని నడక కూడా ప్రత్యేకంగా ఉండడంతో వెంటనే ఫొటోలు తీశాడు. ‘‘అది సాధారణ కుక్కలా అనిపించలేదు. దాని నడక ప్రత్యేకంగా ఉండడంతో పాటూ బూడిద రంగు చర్మం, తోక వంకరగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని హేమంత్ తెలిపారు. ఈ ఫొటోలను పరిశీలించిన నిపుణులు.. ఇది బూడిదరంగు తోడేలే అని తెలిపారు. అయితే తోక చూస్తే అనుమానాస్పదంగా ఉందన్నారు. చాలా మంది నిపుణులు మాత్రం ఇది బూడిద రంగు తోడేలే అని స్పష్టం చేశారు.
Funny Viral Video: ఆశీర్వదించకుండా అతి చేస్తే ఇలాగే అవుతుంది.. ఈ వధువు ఏం చేసిందో చూడండి..
ఓ వణ్యప్రాణి పరిశోధకుడు మాట్లాడుతూ.. ఆ జంతువు తోడేలులా కనిపించిందని, అయితే జన్యు పరీక్షలు చేయకుండా నిర్ధారణకు రాలేమని అభిప్రాయపడ్డారు. ఆ తోడేలు ఉత్తరప్రదేశ్ లేదా రాజస్థాన్ నది ఒడ్డున ప్రయాణించి ఉండొచ్చని చెప్పారు. ఢిల్లీ రిడ్జ్ ప్రాంత పరిధిలో కొన్నేళ్ల కింద తోడేళ్లు, చిరుతలు, జింకలు నివసించేవని చెబుతున్నారు. అయితే 1940 నాటికి తోడేళ్లు తదితర జంతువులన్నీ మాయమయ్యాయని తెలుస్తోంది. ఇదిలా వుండగా, ఈ ఘటనై ఢిల్లీ అటవీ శాఖ అధికారులు స్పందించలేదు. కొందరు అధికారులు మాట్లాడుతూ.. ఫొటోలు పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే అది ఏ జంతువనేది ఇంకా స్పష్టం కాలేదన్నారు. కాగా, ఈ బూడిద రంగు తోడేలు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్పాడ్స్ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..