Share News

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..

ABN , Publish Date - May 27 , 2025 | 12:53 PM

California NRIs Mahanadu: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ప్రవాసాంధ్రుల సారథ్యంలో మినీ మహానాడు వేడుకలు సందడిగా సాగాయి. బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Mahanadu US: అమెరికాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
NTR birth Anniversary And Mini Mahanadu Celebrated In California

NTR birth Anniversary And Mini Mahanadu Celebrated In California: అమెరికాలోని బే ఏరియాలో వెండితెర ఇలవేల్పు, నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకుని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి, వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో మినీ మహానాడు సంబరాలను ఘనంగా నిర్వహించారు. మిల్పిటాస్ నగరంలోని స్టార్ లైట్ పార్క్ వేదికగా జరిగిన మినీ పసుపు పండుగకు పలువురు ఎన్నారైలు హాజరై సందడి చేశారు.


2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు ఈ సారి మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అలాగే కాలిఫోర్నియాలోని తెలుగుదేశం పార్టీ ఎన్నారైలు కూడా మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మహానాయకుడు, కథానాయకుడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 150 మందికి పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, మహిళలు, చిన్నారులు ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నారు.


కార్యక్రమం సందర్భంగా ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి తెలుగుదేశం అభిమానులని ఉద్దేశించి ఆడియో కాల్ ద్వారా మాట్లాడారు. తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం ప‌రిత‌పించిన స‌ముజ్వల దీప్తి నంద‌మూరి తార‌క‌రామారావు గారు చిరస్మరణీయుడు అని పేర్కొన్నారు. 40 అమెరికా నగరాల్లో సంవత్సరం పాటు తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరిపామని.. ఇప్పుడు 102వ జయంతి మాత్రమే కాకుండా ఆ మహనీయుని సినీ రంగ ప్రవేశం జరిగి 75 సంవత్సరాలు అయిన సందర్భం కూడా కావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాభినందనలు తెలిపారు.


ప్రముఖ దర్శకులు, సినీ నటులు కాశీ విశ్వనాధ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సినీ రంగానికి తలమానికమైన తారక రామారావు గారు మనిషి రూపంలో జ‌న్మించిన పుణ్య పురుషులని, ఆయన 102వ జయంతి వేడుకలలో పాలుపంచుకునే అవకాశం దొరకడం తన అదృష్టం అని కొనియాడారు. భవిష్యత్తులో రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత అభివృద్ది సాధిస్తుందని ఆకాంక్షించారు.


కోగంటి వెంకట్ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌర‌వాన్ని ద‌శ దిశలా చాటిన రామారావు గారి జయంతి కార్యక్రమాలు జరిపే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలందరికీ మహానాడు సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో, నారా లోకేష్ గారి యువ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతికి తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా మరింత అంకితమౌతుందని తెలిపారు.


ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ తాడపనేని, విజయ్ గుమ్మడి, గాంధి పాపినేని, లియోన్ బోయపాటి , విజయ్ సాగర్ రెడ్డి సమన్వయపరచగా భరత్ ముప్పిరాల, సీతారాం కొడాలి, హరి బొప్పూడి, రమేష్ మల్లారపు, బ్రహ్మానంద నాయుడు దబ్బర, నరహరి మార్నేని, ధీరజ్ కావూరి, అశోక్ మైనేని, రవికిరణ్ ఆలేటి, కోన నరేంద్రనాథ్ రెడ్డి, తిరుపతిరావు, శ్రీనివాస్ ఆత్మకూరి, హరి సన్నిధి, మోహన్ మల్లంపాటి, వెంకట్ పరిమి, రాఘవయ్య, రాజా కొల్లి, హర్ష యడ్లపాటి, అనిల్ సాపినేని, చంద్రశేఖర్, రాంబాబు మానుకొండ, మోహన్, లోకేష్, ఎంవీ రావు, గాంధీ ప్రసాద్, సుబ్బారావు, కృష్ణ నరుకుళ్ళ, మునిరెడ్డి, నవీన్ కొడాలి తదితరులు పాల్గొన్నారు. చేతన జాగర్లముడి, సునీత రాయపనేని, శిరీష నెక్కలపూడి, రూప గుర్రం, విలేఖ్య వెనిగళ్ళ, రుద్రాణి తాతినేని, మాధురి వెన్నపూస, శైలజ వెల్లంకి, ప్రభావతి కొప్పల్లి, మానస పరిమి, శ్రీదేవి దబ్బర, శిరియాలు నెల్లూరి తదితర మహిళామణులు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.


బే ఏరియాలోని ప్రముఖ రెస్టారెంట్లు బిర్యానీ జంక్షన్, నాన్స్ & కర్రీస్ , బిర్యానీస్ (మిల్పిటాస్), విజేత స్వగృహ ఫుడ్స్, ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (ఫ్రీమోంట్), ఆర్.ఆర్.ఆర్. బిర్యానీస్ (మౌంటైన్ వ్యూ) మినీమహానాడు హాజరైన వారందరికీ పసందైన భోజనం సమకూర్చాయి.


ఇవి కూడా చదవండి

మా తెలుగుతల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభం

పసుపు చొక్కాతో సీఎం చంద్రబాబు గ్రాండ్ ఎంట్రీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 11:08 PM