Home » America
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఒక అమెరికన్ జర్నలిస్ట్ను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక ఇరాన్ మద్దతు ఉన్న కతాయిబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హస్తం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీంతో పశ్చిమాసియాలో పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
భారత సంతతికి చెందిన టెక్నాలజీ నాయకురాలు మంగళ కుప్పా యూఎస్ కార్మిక శాఖ ముఖ్య సమాచార అధికారిగా నియమితులయ్యారు. గతేడాది అక్టోబరు నుంచి తాత్కాలిక హోదాలో పనిచేసిన ఆమెకు పూర్తి స్థాయి సీఐవో బాధ్యతలు అప్పగించారు.
ఇరాన్ అణు కేంద్రక నగరం ఇస్ఫహాన్పై అమెరికా భీకర దాడులు చేసింది. ఆయుధాలు ఉన్న ఓ డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్లతో దాడులు చేయడంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి.
తీవ్ర ఇంధన కొరతతో సతమతమవుతున్న క్యూబాకు రష్యా ఉపశమనం కలిగించింది. లక్ష టన్నుల ఇంధనాన్ని క్యూబాకు చేరవేసింది. అమెరికా విధించిన ఆంక్షలతో క్యూబాలో తీవ్ర ఇంధన కొరత, విద్యుత్ కోతలు నెలకొన్న సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో అమెరికా వేల సంఖ్యలో పారాట్రూపర్లను మోహరించింది. వ్యూహాత్మక ప్రాంతాలకు వీరిని తరలించింది. మిత్రదేశాలకు రక్షణ, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే దీని లక్ష్యమని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి.
పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ముందుకొచ్చిన పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్థాన్ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాక్ ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించింది.
ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇరాన్లోని కీలకమైన ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు ఆ దేశ అణు కార్యక్రమాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ దాడిలో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, అది ఇక ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది.
ఇరాన్లోని మినాబ్లో ఎలిమెంటరీ స్కూలుపై ఇటీవల అమెరికా క్షిపణి దాడి జరిపి 170 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన టెహ్రాన్-వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ క్షిపణిని ప్రయోగించిన అమెరికా నౌకాదళ అధికారుల ఫోటోలను ఇరాన్ తాజాగా విడుదల చేసింది.