Home » NRI Latest News
సాల్ట్ లేక్ సిటీలో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కార్యక్రమం జరిగింది. దాతలు అనేక మంది ఈ కార్యక్రమంలో నిధులను అందించారు.
పంచాయతీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రవాసీయులు అనేక మంది స్వదేశానికి వచ్చారు. పక్కా వ్యూహంతో ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఇతర అభ్యర్థులకు గట్టిపోటీని ఇస్తున్నారు.
తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గం కోలువుదీరింది. పలు సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించి తమ కార్యకలాపాలకు నాంది పలికింది. ఈ ఈవెంట్లో కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు కళా సమితి (టి.కె.యస్) సేవలను ప్రశంసిస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం సంస్థ ప్రతినిధులను సగౌరవంగా సత్కరించింది. తమ సేవలకు గుర్తింపుగా వారు జ్ఞాపికలను అందుకున్నారు.
హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎమ్ఈఎస్యూ సేవల విస్తరణ కోసం శంకర నేత్రాలయ యూఎస్ఏ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించింది. జార్జియాలోని కమ్మింగ్లోగల వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 1.625 మిలియన్ డాలర్ల సమీకరణ చేశారు. పలువురు ప్రముఖులను ఈవెంట్ నిర్వాహకులు సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్సవ వేడుకలు ఖతర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన భారత ఎంబసీ దౌత్యవేత్త, ప్రథమ కార్యదర్శి ఈశ్ సింఘాల్ స్థానిక తెలుగు సంఘాలు అభినందించారు. తెలుగు సంస్కృతికి తరువాతి తరాలకు అందించేందుకు సంఘాలు పలు సేవ, సాంస్కృత్రిక కార్యక్రమాలు చేస్తున్నాయని ప్రశంసించారు.
దుబాయిలో శనివారం సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సేవా సమితి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మహానుభావుడి సేవలు, స్ఫూర్తిదాయక భావాలు, సామాజిక న్యాయానికి చేసిన కృషిని స్మరించుకోవాలని అన్నారు.
టొరంటోలో ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్ వైభవంగా జరిగింది. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 800లకు పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.