Canada DTC: టొరంటోలో డర్హమ్ తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో వైభవంగా ఫ్యామిలీ ఫెస్ట్-2025
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:32 PM
టొరంటోలో ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్ వైభవంగా జరిగింది. కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 800లకు పైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) ఆధ్వర్యంలో కార్తీక మాసపు వనభోజనం కాన్సెప్ట్తో ‘డి.టి.సి. ఫ్యామిలీ ఫెస్ట్ 2025’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. టొరంటోలోని మ్యాక్స్వెల్ హైట్స్ సెకండరీ స్కూల్, ఓషావా ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 800లకు పైగా తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అపర్ణ రంభోట్ల, సంతోష్ కుంద్రు, యువ వ్యాఖ్యాతలుగా ఆశ్రిత పోన్నపల్లి, శిరి వంశికా చిలువేరు, శ్రేయస్ ఫణి పెండ్యాల వ్యవహరించారు. డి.టి.సి. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి గుత్తిరెడ్డి, రవి మేకల, వెంకటేశ్వర్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగి శెట్టి, గుణశేఖర్ కోనపల్లి, యుగంధర్ చెరుకురి, గౌతమ్ పిడపర్తి, వసుదేవకుమార్ మల్లుల, కమల్ మూర్తి, సర్దార్ ఖాన్ చెరుకుపాలెం, శివరామ్ మోహన్ పసుపులేటిల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. తరువాత కెనడా జాతీయ గీతం, మా తెలుగు తల్లి గీతంతో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల పిల్లలు, కళాకారులు అద్భుతమైన నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సంప్రదాయ కళారూపాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలో డి.టి.సి. కుకింగ్ షో, డి.టి.సి. కిడ్స్ ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. విజేతలు, పాల్గొన్న వారికి ‘Advanced Physio’ వారి బహుమతులు గ్రాండ్ స్పాన్సర్గా తూసి వినయగమూర్తి అందజేశారు.

డి.టి.సి. కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కెనడాలో నివసిస్తున్న తెలుగు సమాజం చూపుతున్న ఐక్యత, సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు. భారత సాహితీ సంపద ఉత్సవాలను కెనడాలో ఘనంగా జరపడం తమ అదృష్టంగా భావిస్తున్నానని డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు అన్నారు.
సెయింట్ మైకేల్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగం హెడ్ డా.బాబీ యానగావా ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ఆయన కార్డియో ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యంపై విలువైన సూచనలు అందించి డర్హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంరక్షణ గురించి అందరికీ ఉపయోగపడే విషయాలను చక్కగా వివరించారు.
ఈ సందర్భంగా డి.టి.సి. ఎక్సలెన్సీ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. డా.బాబీ, డా.శరత్ గుండల, డా.శ్రీవాణి గుండల చేతుల మీదుగా డి.టి.సి. కమ్యూనిటీ సర్వీస్ ఎక్సలెన్సీ అవార్డును ఉషా నడురికి, డి.టి.సి. ఆర్ట్స్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ ఎక్సలెన్సీ అవార్డును చిన్నారి సిరి వంశిక చిలువేరుకు, డి.టి.సి. ఆర్ట్స్ అండ్ సింగింగ్ ఎక్సలెన్సీ అవార్డును చిన్నారి శ్రేయస్ ఫణి పెండ్యాలకు అందజేసారు. ముగ్గురు అవార్డు గ్రహీతలకూ డీటీసీ తరఫున సత్కారం చేసి, వారి ప్రతిభను అభినందించారు.

కార్యక్రమ విజయానికి చేయూతనిచ్చిన ప్రాయోజకులను డీటీసీ సంస్థ శాలువాలతో సత్కరించింది. ఈ సందర్భంగా గ్రాండ్ స్పాన్సర్గా తూసి వినయగమూర్తి, ఫుడ్ స్పాన్సర్స్గా సింప్లీ సౌత్ రెస్టారెంట్– ఓషావా (రామ్ & సస్య పెడ్డి) సహకరించారు. సిల్వర్ స్పాన్సర్స్గా రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియల్టీ (రమేష్ గోలు, ఆనంద పెరిచెర్ల), రఘు జులూరి, భారత్ లా మద్దతు అందించారు. అలాగే సపోర్టింగ్ స్పాన్సర్స్గా అడ్వాన్స్ ఫిజియో (గౌతమ్ పిడపర్తి), డా. శరత్ గుండల, డా.పద్మజా రాణి కొంగరా, డా. సౌజన్య కసులా, దేశీ కార్ట్ గ్రోసరీస్ (రాజశేఖర్), శివమ్మ టిఫిన్స్, బండీ మేడ బజ్జి (శ్రవంతి), నమస్తే ఇండియా సూపర్ మార్కెట్ – ఏజాక్స్ (యోగేశ్ జీ), షోబి డెకోర్స్, పవన్ పీకే ఫోటోగ్రఫీ వంటి ప్రాయోజకులు ఈ కార్యక్రమానికి విలువైన సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గ్రేటర్ టొరంటో ఏరియా(జీ.టీ.ఏ)లోని పలు తెలుగు సంఘాల ప్రతినిధులను డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు ఆహ్వానించి వారిని సత్కరించారు. ఈ సందర్భంలో DTC ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గుత్తిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించే దిశగా, గ్రేటర్ టొరంటో ఏరియా(జి.టి.ఎ)లోని అన్ని సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాక, డర్హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) సమాజ కార్యక్రమాలు, వినూత్న ప్రోగ్రామ్స్, ఎక్సలెన్సీ అవార్డులు, సహకార కార్యక్రమాల విజయానికి ప్రాయోజకులు అందిస్తున్న మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే, డర్హమ్ తెలుగు అసోసియేషన్ (డి.టి.ఎ) నుండి స్వాతి మిర్యాల, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓ.టి.ఎఫ్) నుండి శ్రీ ప్రవీణ్ నీలా, బర్చ్మాంట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ (బి.ఎఫ్.సి) నుండి జగపతి రాయల, శ్రీ సూర్య కొండేటి, టొరంటో తెలుగు కమ్యూనిటీ (టి.టి.సి) నుండి విజయ కుమార్ కోట, క్లారింగ్టన్ హిందూ అసోసియేషన్, డర్హమ్ హైదరాబాదీ అసోసియేషన్ నుండి వారి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని, డర్హమ్ తెలుగు క్లబ్ (DTC) వారు తెలుగు సమాజానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు.

డీటీసీ ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు విందును సింప్లీ సౌత్ – ఒషావా సౌజన్యంతో అందించారు. అలాగే, డర్హమ్ తెలుగు క్లబ్ (డి.టి.సి) వారు 20 కిపైగా బహుమతులతో రాఫెల్ డ్రా విజయవంతంగా నిర్వహించారు.
డీటీసీ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న భావంతో, తెలుగు సంస్కృతి, ఐక్యత, ఆనందాలతో నిండిన డీటీసీ ఫ్యామిలీ ఫెస్ట్ 2025 కార్యక్రమం కెనడా టొరంటోలో ఘనంగా విజయం సాధించిందని అన్నారు. చివరగా డీటీసీ కల్చరల్ డైరెక్టర్ వెంకటేశ్వర్ చిలువేరు డీటీసీ కార్యకర్తలు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, వందన సమర్పణలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.











ఈ వార్తలు కూడా చదవండి
ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి
SATA ఆధ్వర్యంలో జెద్ధా నగరంలో తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయిక