Home » NRI
బాల్టిమోర్లో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలకు మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ను కూడా సభలకు ఆహ్వానించగా వారు సానుకూలంగా స్పందించినట్లు ఆటా తెలిపింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కి అనుబంధ సంస్థ తానా ఫౌండేషన్(TANA Foundation). ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో“Stitching Hope – Sewing Machines to Empower the Needy” పలు కార్యక్రమాలు చేపట్టింది.
డల్లాస్ సమీపంలోని సౌత్లేక్కు చెందిన ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి మెండు. తన అభిరుచితో నేర్చుకున్న విజ్ఞానాన్ని అమెరికాలోని పిల్లలకు ఆర్థిక పాఠాలుగా బోధిస్తుంది.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుంటుంది. తానా ఆధ్వర్యంలో చార్లెట్ టీం.. శ్రీ సాయి గురు దేవదత్త మందిరం, ‘హార్ట్సేఫ్ వర్క్ప్లేస్’ సంయుక్తంగా నార్త్ కరోలినాలోని కాంకర్డ్లో సీపీఆర్, ఏఈడీ శిక్షణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
యూఎస్లో తెలుగు వారికే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులకు తానా గుడ్ న్యూస్ చెప్పింది.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఓహియో వ్యాలీలో ప్రాంతీయ వాలీబాల్ టోర్నమెంట్ మార్చి 1వ తేదీన కొలంబస్లో ఘనంగా నిర్వహించారు.
గల్ఫ్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఏపీ ప్రభుత్వం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ హెల్ప్ లైన్లు వినియోగించుకోవాలంటూ వారికి మంత్రి కొండపల్లి సూచించారు.
అమెరికాలో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన భారీ అండర్కవర్ ఆపరేషన్లో ఒక తెలుగు వ్యక్తితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది..
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. భారత స్టాక్ మార్కెట్లో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. మరోవైపు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు.
‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి ఎంపికయ్యారు. డల్లాస్లో అత్యంత ప్రభావవంతమైన తెలుగు సంస్థకు అధ్యక్షురాలిగా వరుసగా మూడవసారి ఒక మహిళే ఎన్నిక కావడం విశేషం.