Home » Mahanadu 2025
మాజీసీఎం జగన్ అడ్డా కడప గడ్డ ఇప్పుడు టిడిపికి అడ్డాగా మారిందా.. కడప గడ్డపై టిడిపి మహానాడు జనసంద్రాన్ని చూసిన జగన్ రెడ్డి జడుసుకున్నాడా.. వైయస్ కుటుంబ రాజకీయ కోట కడప గడ్డ ఇక టిడిపి కోటగా మారుతుందేమో అని జగన్ రెడ్డి భయందోళనకు గురవుతున్నాడా.. కడప వైసీపీ నేతల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్ పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులంతా ఆయన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు.
కడపలో జరిగిన టీడీపీ మహానాడు సూపర్ హిట్గా ముగియగా, లోకేష్ మార్కు ముఖ్యాంశాలు, చంద్రబాబు అధ్యక్షత్వంలో పార్టీలో సమయపాలన పై పెద్దపీట వేసారు. లక్షలాది కార్యకర్తలు, అభిమానులు బహిరంగ సభకు హాజరై విజయ సంబరాలు జరుపుకున్నారు.
కడపలో మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆర్. మాధవి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి రూ.90 కోట్లు విడుదల చేసిన ఆయన కృషిని ప్రశంసించారు.
ఢిల్లీలో పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు గురువారం నాడు ఢిల్లీ వెళ్లారు. కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.
నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు ఉండేవని లోకేష్ మండిపడ్డారు.
TDP Mahanadu: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.
TDP Mahanadu 2025 Live: కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం.
ఇంతవరకు జరిగిన అన్ని మహానాడుల కంటే కడప మహానాడు ప్రత్యేకమన్నారు సీఎం చంద్రబాబు. ఇంతవరకు శక్తిమేర పార్టీని సమర్థంగా నడిపానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
Pulivendula Tension: పులివెందులలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. టీడీపీ మహానాడు సందర్భంగా పులివెందులలో తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన వారు నానా బీభత్సం సృష్టించారు.