Share News

Chandrababu: మా లక్ష్యం ఇదే.. BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్

ABN , Publish Date - May 28 , 2025 | 06:16 PM

ఇంతవరకు జరిగిన అన్ని మహానాడుల కంటే కడప మహానాడు ప్రత్యేకమన్నారు సీఎం చంద్రబాబు. ఇంతవరకు శక్తిమేర పార్టీని సమర్థంగా నడిపానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

Chandrababu: మా లక్ష్యం ఇదే.. BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.. చంద్రబాబు సెన్సేషనల్ కామెంట్స్
CM Chandrababu Naidu

కడప, మే 28: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ఇంతవరకు శక్తిమేర పార్టీని సమర్థంగా నడిపానన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నా బలం, బలగం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఇంతవరకు జరిగిన అన్ని మహానాడుల కంటే కడప మహానాడు ప్రత్యేకమన్నారు.

వారిని వదిలిపెట్టం..

తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుందని, రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని తుదముట్టించిన పార్టీ టీడీపీ అన్నారు. గత ఐదేళ్లు ఏపీలో శాంతిభద్రతలు లేవని, వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారని అయితే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.


సస్యశ్యామలం చేస్తాం..

ఈ నేపధ్యంలో ఏపీలో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. శాంతిభద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిలా ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని ఫైర్ అయ్యారు. రాయలసీమను ఎడారి కానివ్వమని, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..

బనకచర్ల వరకు నీరు తేవాలన్నదే తమ లక్ష్యమన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తామని, నదీ జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రమని, నదుల అనుసంధానంతో తెలంగాణకూ లాభమేనని చంద్రబాబు వివరించారు. ఈ అంశంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని, సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తప్పేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు వంటివి అని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 28 , 2025 | 07:25 PM