Home » YCP
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
అంతర్జాతీయ కంపెనీల యజమానులతో లోకేష్ సమావేశం కావడం జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు కేవలం ఈర్ష్యతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మండిపడ్డారు. లోకేష్ తన వ్యక్తిగత పర్యటనలకు సొంత నిధులు వాడుతున్నారు తప్ప, ప్రభుత్వ డబ్బు వాడుకోవడం లేదని తెలిపారు.
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు శ్రీధర్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరే్ంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.
మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలో పార్టీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ మోషేన్ రాజు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎవరి ప్రోద్భలంతోనైనా లేక ప్రలోభాలకు లోనై రాజీనామాలు చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ ప్రశ్నించారు.
వైసీపీ నేతలకు హడావుడి ఎక్కువ.. ఆదరణ తక్కువ. ముందుగా ఆర్భాటంగా ఆరంభించడం.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెన్ను చూపి వెనుతిరగడం రివాజుగా మారింది. మెడికల్ కాలేజీల విషయంలో ఇదే జరిగింది.
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.