
TDP Mahanadu: మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
ABN , First Publish Date - May 28 , 2025 | 09:35 AM
TDP Mahanadu 2025 Live: కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం.

Live News & Update
-
May 28, 2025 21:17 IST
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం పెట్టాం: చంద్రబాబు
మళ్లీ స్కూల్స్ తెరిచేలోపే టీచర్ల నియామక ప్రక్రియ.
-
May 28, 2025 20:17 IST
10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం: చంద్రబాబు
రూ.4,500 కోట్లతో ఫేజ్-1 పనులు చేపడతాం.
మరో రూ.4,500 కోట్లతో ఫేజ్-2 పనులు చేపడతాం.
రెండు దశల్లో రూ.9 వేల కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ పనులు.
కడప స్టీల్ ప్లాంట్తో 3 వేల మందికి ఉద్యోగాలు.
-
May 28, 2025 20:16 IST
రాయలసీమను అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు
రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు రావాలి.
అనంతపురం జిల్లా లేపాక్షి ఏరోస్పేస్.. ఇండస్ట్రీస్కు అనువైన ప్రాంతమని కేంద్రానికి చెప్పా.
బెంగళూరులో ఉన్న HALను అనంతపురానికి తరలించాలని.. కేంద్రాన్ని కోరినట్లు కర్ణాటక కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం.
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.
వేరే రాష్ట్రాల ప్రాజెక్టులు తరలించుకుపోవాలని అనుకోను.
గండికోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం.
గండికోటలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతాం.
-
May 28, 2025 20:14 IST
అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు
అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం.
విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తాం.
విశాఖ స్టీల్కు కేంద్రం ఎంతో సహకరిస్తోంది.
విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,400 కోట్లు ఇచ్చింది.
విశాఖకు టీసీఎస్, గూగుల్ వస్తున్నాయి.
విశాఖను నాలెడ్జ్ హబ్గా తయారుచేస్తాం.
త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుంది.
-
May 28, 2025 20:14 IST
ఏపీని క్లీన్, గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారుచేస్తాం: చంద్రబాబు
ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేసే సత్తా మనకుంది.
కరెంట్ చార్జీలు పెంచేది లేదని చెప్పా.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా.
వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.
ప్రతి ఒక్కరూ ఇళ్లపై సోలాన్ ప్యానెల్స్ పెట్టుకోవాలి: చంద్రబాబు
-
May 28, 2025 20:14 IST
నదీ జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రం: చంద్రబాబు
నదుల అనుసంధానంతో తెలంగాణకూ లాభమే.
ఈ అంశంలో BRS తప్పుడు ప్రచారం చేస్తోంది.
బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు.
సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తప్పేంటి?
ఏపీలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నదే లక్ష్యం.
ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏనాడూ అభ్యంతరం తెలపలేదు.
-
May 28, 2025 20:14 IST
రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ వైసీపీ: చంద్రబాబు
రాయలసీమను ఎడారి కానివ్వం.
రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం.
పోలవరం నుంచి బనకచర్లకు నీరు తేవాలన్నదే లక్ష్యం.
నదుల అనుసంధానం పూర్తి చేస్తాం.
నదుల అనుసంధానానికి కేంద్రం కూడా సహకరిస్తోంది.
-
May 28, 2025 20:09 IST
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో శాంతిభద్రతలు లేవు: చంద్రబాబు
వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది.
బాబాయిని హత్య చేసి ఆ నింద మనపై మోపాలని చూశారు.
తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.
గంజాయిని పూర్తిగా నియంత్రిస్తాం.
శాంతిభద్రతలను ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు.
తప్పు చేసినవారి పట్ల చండశాసనుడిలా ఉంటా.
-
May 28, 2025 20:08 IST
ఇంతవరకు శక్తిమేర పార్టీని సమర్థంగా నడిపా: చంద్రబాబు
నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
నా బలం, బలగం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలే.
ఇంతవరకు జరిగిన అన్ని మహానాడుల కంటే కడప మహానాడు ప్రత్యేకం.
తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది.
రానున్న 40 ఏళ్లకు ప్రణాళికలు రూపొందించుకున్నాం.
ఫ్యాక్షనిజం, నక్సలిజాన్ని తుదముట్టించిన పార్టీ టీడీపీ.
-
May 28, 2025 17:19 IST
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు
-
May 28, 2025 15:55 IST
టీడీపీకి రూ. 43 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే..
పల్నాడు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్ రూ. 43 లక్షలు పార్టీకి విరాళం ఇచ్చారు.
మహానాడు వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ చెక్కును అందజేశారు ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్.
-
May 28, 2025 15:39 IST
కడప : పులివెందులలో ఉద్రిక్తత పరిస్థితులు.
తెలుగుదేశం మహానాడు జెండాలను, బ్యానర్లను పీకేసిన వైసిపి శ్రేణులు.
పీకేసిన జెండాలను, బ్యానర్లను మళ్లీ కట్టుకున్న టిడిపి శ్రేణులు.
మళ్లీ పీకుతాం ఏమి చేస్తారో చేసుకోండి అంటూ.. మళ్లీ పీకేందుకు సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు.
పులివెందుల వైసిపి కార్యాలయం వద్ద భారీగా గుమికూడుతున్న వైసీపీ శ్రేణులు.
టిడిపి కార్యాలయం వద్ద కూడా భారీగాచేరుకుంటున్న టిడిపి కార్యకర్తలు.
పరిస్థితులను గమనించి అప్రమత్తమైన పోలీసులు.
-
May 28, 2025 14:59 IST
కడప: సీఎం చంద్రబాబు చెప్పిన హెల్త్ సీక్రెట్
రోజు అరగంట ప్రాణాయామం చేస్తే రక్త ప్రసరణ బాగుంటుంది: సీఎం
ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుంది.
ఆరోగ్య కరమైన జీవనానికి యోగా చాలా మంచిది.
మన ప్రధాని నరేంద్ర మోదీ యోగాని ప్రపంచానికి పరిచయం చేశారు.
విదేశాల్లో కూడా యోగా వారి జీవనంలో భాగం అయింది.
రాబోయే మహానాడుకు అందరు యోగా చేయాలి.
యోగా నేర్చుకొని మీరు జూన్ 21 న విశాఖ రావాలి.
కార్యకర్తలు కంటే వేదికపై ఉన్న నేతలకు యోగ అవసరం.
ఎందుకంటే వీరికి ఫోకస్ వేరే అంశాలపై ఉంటుంది.
రాష్ట్రంలో కనీసం 20 లక్షల మంది సర్టిఫికెట్లు తీసుకోవాలి.
రాష్ట్రంలో ఒకే రోజు 2 కోట్ల మంది యోగా చేయాలి.
ఒకే ప్లేస్లో అంటే విశాఖ RK బీచ్లో 5 లక్షల మంది యోగ చేస్తున్నారు.
విద్యా సంస్థల్లో కూడా ఒక గంట యోగా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
యోగాలో ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్నాము.
యోగాపై రెండు నిమిషాలు మెడిటేషన్ చేసిన తరువాత ఆలోచించి ఆమోదించాలని కోరిన చంద్రబాబు.
యోగాంధ్రకు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాను.
జూన్ 21 న జరిగే యోగా ప్రపంచం ఆశ్చర్యం చెందే విధంగా ఉండాలి అని కోరుతున్నాను.
-
May 28, 2025 13:45 IST
ఎన్.టి.ఆర్. చరిత అజరామరం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
స్వర్గీయ ఎన్.టి.ఆర్. చరిత అజరామరం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యమైనా సత్ఫలాన్ని ఇస్తుందని నేను విశ్వసిస్తానని చెప్పిన పవన్.. అటువంటి త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అన్నారు. 'మనసు - మాట - కర్మ (పని)మూడు అంశాలు సమన్వయం చేసుకొంటూ పని చేయడం ఆయనలో నేను గమనించాను. అందుకే వేషం వేసినా, రాజకీయం ఆచరించినా, ప్రజాసేవ చేసినా ఎన్.టి.ఆర్. గారు సత్ఫలితాలను సాధించారు. నటుడిగా, రాజకీయ నేతగా, పరిపాలనాదక్షునిగా... చరిత్ర పుటలు నుంచి చెరిపివేయలేని చరిత ఆయనది.. నేడు ఆ మహామనీషి, కళా ఋషి జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి అర్పిస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
-
May 28, 2025 13:31 IST
నేరస్థులూ జాగ్రత్త.. నా దగ్గర మీ ఆటలూ సాగవు: చంద్రబాబు
'నేరస్థులూ ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలూ సాగవు అంటూ హెచ్చరించారు చంద్రబాబు. మహానాడు వేదిక నుంచి పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. 'కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నా. నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి'. అని చంద్రబాబు అన్నారు.
-
May 28, 2025 13:27 IST
కోవర్టులపట్ల అప్రమత్తంగా ఉండండి: చంద్రబాబు
'కోవర్టులను పార్టీలోకి పంపాలనుకుంటే మీ ఆటలు సాగవు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి అదే చివరి రోజు అవుతుంది' అని మహానాడులో చంద్రబాబు హెచ్చరించారు. 'పార్టీలోకి వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు' అని చంద్రబాబు చెప్పారు.
-
May 28, 2025 13:27 IST
మహానాడు సభా నిర్వహణపై సంతోషంలో మునిగితేలుతున్న చంద్రబాబు
-
May 28, 2025 13:18 IST
మహానాడుకు ఉరకలేసే ఉత్సాహంతో హాజరైన అశేష టీడీపీ కుటుంబం
-
May 28, 2025 13:14 IST
ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పువ్వులు వేస్తున్న నారా లోకేష్
-
May 28, 2025 13:07 IST
మన నేతకు ఘన నివాళులర్పిద్దాం: చంద్రబాబు
ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ-రాజకీయ సార్వభౌముడు... నందమూరి తారక రామారావు గారి జయంతి. మహనీయులు, కారణ జన్మములు అయిన ఎన్టీఆర్కి మహానాడు వేదికగా ఘన నివాళులు అర్పిద్దాం.
-
May 28, 2025 13:07 IST
కడపలో నిర్వహిస్తూన్న టీడీపీ మహానాడు 2025 వేదిక.. ఫుల్ వ్యూ
-
May 28, 2025 13:07 IST
పార్టీ నేతల్ని ఆప్యాయంగా పలకరిస్తున్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్
-
May 28, 2025 12:57 IST
మహానాడు ప్రాంగణానికి పసుపు సైకిళ్ల మీద చేరుకున్న టీడీపీ సీనియర్ నేతలు
-
May 28, 2025 12:53 IST
మహానాడు ప్రాంగణానికి పసుపు సైకిళ్ల మీద చేరుకున్న టీడీపీ యువ నేతలు
-
May 28, 2025 12:53 IST
సభా ప్రాంగణంలో సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సంతోషంలో మహిళామూర్తులు
-
May 28, 2025 12:44 IST
'నా తెలుగు కుటుంబం' 6 సూత్రాలు ఒక గేమ్ చేంజర్: చంద్రబాబు
పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన "నా తెలుగు కుటుంబం" 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయి. ఎన్టీఆర్ ఆశీస్సులు మనకు ఉన్నాయి. తెలుగుజాతి 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుందని చంద్రబాబు చెప్పారు.
-
May 28, 2025 12:10 IST
ఎన్టీఆర్ స్పూర్తి భావితరాలకు ఆదర్శం: అశోక గజపతి రాజు
తెలుగువారి ఘనతను చాటి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆ ఘనతను స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించాలి. నందమూరి ఆశయాలను కొనసాగిస్తున్న నారా చంద్రబాబు బాటలో అందరం నడవాలి.
-
May 28, 2025 10:56 IST
కడపలో పసుపు పండుగ
కడప జిల్లా మైదుకూరులో దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో మైదుకూరులోని ఎస్సిసిఆర్ ఫంక్షన్ హాల్ లో వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకొచ్చారని ఈ సందర్భంగా బూరుగుపల్లి పేర్కొన్నారు.
-
May 28, 2025 10:40 IST
భద్రాచలంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామా రావు 102వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం కూనవరం రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద భద్రాచలం టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భద్రాచలం పట్టణం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని.. గతంలో భద్రాచలం డివిజన్లో భద్రాచలం నుండి లొట్టిపిట్ట గండి వరకు, భద్రాచలం నుండి చిత్తూరు వరకు అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయని నేతలు చెప్పుకొచ్చారు.
-
May 28, 2025 10:22 IST
ఎన్టీఆర్కి ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. సినీ రంగంతోపాటు, సమాజ సేవ, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు ఎన్టీఆర్ కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ఎన్టీఆర్ నుంచి తానెంతో ప్రేరణ పొందినట్లు మోదీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందని మోదీ వెల్లడించారు.
-
May 28, 2025 09:58 IST
కిలో రెండు రూపాయలకే బియ్యం అందించిన గొప్ప వ్యక్తి
దేశంలోనే మొట్టమొదటి సారిగా కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చారని చంద్రబాబు అన్నారు. నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలనే సంకల్పమే ఆయన్ను ముందుకు నడిపించిందని చంద్రబాబు అన్నారు. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నామని, భవిష్యత్ లోనూ ఉంటామని చంద్రబాబు తెలిపారు.
-
May 28, 2025 09:58 IST
రాజకీయాల్ని ప్రక్షాళన చేసిన వ్యక్తి ఎన్టీఆర్: చంద్రబాబు
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చారు. మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచారని చంద్రబాబు కీర్తించారు.
-
May 28, 2025 09:52 IST
సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త ‘అన్న’ ఎన్టీఆర్: చంద్రబాబు
తెలుగు వారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
-
May 28, 2025 09:36 IST
కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొంటున్నారు.