Minister Anam: దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు: మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:13 PM
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
నెల్లూరు,నవంబరు8 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు వస్తాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Rama Narayana Reddy) స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో రూ.5.38కోట్లతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. స్వామివారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
ఏపీలో కొండబిట్రగుంట దేవస్థానాన్ని రెండో తిరుమల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇప్పటికే రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. కావలి నియోజకవర్గంలో దేవస్థానాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ద్వారా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేల చొప్పున సహాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
కొండబిట్రగుంట అభివృద్ధికి మంత్రి ఆనం నిధులు కేటాయించారు: ఎమ్మెల్యే కృష్ణారెడ్డి
కొండబిట్రగుంట అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నిధులు కేటాయించారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ధ్యాన మందిరానికి రూ.23లక్షలు, రథశాలకు ప్రత్యేక నిధుల మంజూరు చేశారని పేర్కొన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
ఇవి కూడా చదవండి...
ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు
Read Latest AP News And Telugu News