Home » Anam Ramanarayana Reddy
నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
చైర్మన్ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
సింహాచలం దేవస్థానం పరిసరాల్లోని పంచగ్రామ సమస్యలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. భూమి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. హైకోర్టు ఆదేశాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.
ఏపీలోని అన్ని ఆలయాలు శోభాయమానంగా ఉన్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందూ ధర్మ ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతిని విజయవంతంగా జరుపుకున్నామని మంత్రి వెల్లడించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములను దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు..
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన శైలి రెండు విధాలుగా ఉంటుందని ధ్వజమెత్తారు.
అన్నదాతల సంక్షేమానికి తమ ప్రభత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ.. వారి సమస్యలను సకాలంలో పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులని ప్రభుత్వం కల్పిస్తూ మీ భూమి - మీ హక్కు కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.