Home » Anam Ramanarayana Reddy
ఆడబిడ్డ నిధిని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబునాయుడు అని అభివర్ణించారు.
Local Body Funds: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ఇంటింటికీ వెళ్లి అధికారులు పంపిణీ చేశారని.. వాలెంటరీ వ్యవస్థ లేకుండానే అమలు చేశారని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్లో 28 వేల కోట్లు రూపాయలు ఇస్తామంటే, 2 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం వినియోగించు కోలేదని విమర్శించారు.
Anam On YSRCP: కేంద్రం జలజీవన్ మిషన్కు గతంలో రూ.28 వేల కోట్ల నిధులు ఇచ్చిందని.. కానీ గత ప్రభుత్వం దున్నపోతు మీద వానపడ్డట్టు వ్యవహరించిందని మంత్రి ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధాని మోదీతో చర్చించి, మరో రెండేళ్ల కాలం పొడిగించేలా చేశారని తెలిపారు.
Anam On Unemployed Archakas: శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ.147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయని మంత్రి ఆనం అన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో రూ.11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉందన్నారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందిచ్చే విధంగా తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపడుతోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న పలు విభాగాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Anam Ramanarayana: 2004 జూన్ నాటికి ఏడాది కాలంలో 22 ప్రమాదాలు జరిగాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన చర్యల వల్ల ఈ ఏడాది జూన్ నాటికి 10 ప్రమాదాలు జరిగాయని... ప్రమాదాలని పూర్తిగా నివారించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
Minister Anam Ramanarayana Reddy: టీడీపీ కార్యకర్తలకు అండగా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరులో సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Minister Anam Ramanarayana Reddy: పారిశ్రామిక వేత్తలను ప్రాధేయపడి మంత్రి నారా లోకేశ్ ఏపీకి పరిశ్రమలు తెస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటిగా కలిసి ప్రజల కోసం పనిచేస్తున్నారని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పేర్కొన్నారు.
Tirumala:వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖల్ని రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.