Home » Nellore
కూటమి ప్రభుత్వంలో రానున్న నాలుగేళ్లు వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం కామన్గా మారుతుంది అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి అన్నారు.
నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
YSRCP Leader Attacks: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెంచుగానిపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ నివాసానికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చాడు.
మతసామరస్యానికి ప్రతీకగా, రాష్ట్ర పండుగగా నెల్లూరులో ఏటా జరిగే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ జూలై 6వ తేదీన ప్రారంభం కానుంది.
నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.
Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలుగానే తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.
Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.
నెల్లూరు నగరంలోని వసంతోపులో మరో కరోనా కేసు నమోదైంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలి(61)కి ఆదివారం కరోనా నిర్ధారణ అయింది. నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్ష చేశారు.