Home » AP Govt
Tenali Railway Station: తెనాలి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిం చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.
Kandula Durgesh: ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. భారత ప్రభుత్వం బుద్దుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలో ప్రదర్శించనున్నారు.
Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
ఉగ్రవాదులను ఎదుర్కొవడమంటే ధైర్యంతో కూడుకున్న పని అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పహల్గాం దాడిలో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
Land Mafia: నెల్లూరు జిల్లాలోని వింజమూరులో ఉన్న సర్కార్ భూములపై భూమాఫియా సరికొత్త కుట్రలకు తెరదీసింది. గత యాభై ఏళ్లుగా ఈ భూములు భూ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. అయితే ఈ భూముల విలువ వందకోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మావోయిస్టు నేత ఆజాద్పై కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒడిసాలో 37 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.
ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపుపై జగన్ చేస్తున్న ఆరోపణలను కొమ్మారెడ్డి పట్టాభి తిప్పికొట్టారు. భూములను 99 పైసలకు ఇచ్చినట్లు నిరూపించాలంటూ సవాల్ విసిరారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల కోసం మున్సిపల్ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం, ప్రజారోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు సరిపడా నిధులు కేటాయించాలని స్పష్టం చేస్తుంది