నెల్లూరు జిల్లాలోని వెంకటాచల మండలం కాకర్లవారిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
YSRCP Leader Attacks: కావలిలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చెంచుగానిపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ నివాసానికి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చాడు.
ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన చిన్నారి పట్ల వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో అతడిపై చిన్నారి తల్లిదండ్రులు దాడికి యత్నించారు.
Kakani: కృష్ణపట్నం లారీ అసోసియేషన్ని నిర్వీర్యం చేసి, కృష్ణపట్నం లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి.. పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలింపుకు కాకాణి సహాకారం అందించారని విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోర్టు నుంచి 60 ఎక్స్పోర్ట్ కంపెనీలు తరలిపోయాయి. ఇరవై వేల మంది ఉపాధికి గండి పడింది.
Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలుగానే తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.
Kakani CID custody: ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. నిన్న(సోమవారం) రాత్రి మహారాష్ట్రలోని పింప్రీ చించివాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని మంత్రి నారాయణ, అధికారులు సందర్శించారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
YCP Leader Kakani: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు తాజాగా మరో కేసు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య రెండుకు చేరింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్ గేట్ను ఏర్పాటు చేసి అక్రమంగా నగదు వసూలు చేశారంటూ మరో కేసును ముత్తుకూరు పోలీసులు నమోదు చేశారు.
Kakani Mining Case: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలిరోజు కస్టడీలో సరైన సమాధానాలు చెప్పని మాజీ మంత్రి.. రెండో రోజు విచారణలో పోలీసులకు సహకరిస్తారా లేదా అనేది చూడాలి.