అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణంతో సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండ్ చాటడం ఖాయమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. అమరావతే ఏపీ రాజధాని అంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించడం శుభపరిణామం అని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. కోవూరు మండలం ఇనమడుగులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం గూడూరు మండలం పేడూరు గ్రామాన్ని సందర్శించారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు.
రైతుల నుంచి మొత్తం ధాన్యాన్నీ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదని మంత్రి ఆరోపించారు.
నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. తమిళనాడులోని సీఎంసీ వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా న్యూరో సమస్యతో బాధపడుతున్న ఆయనకు గత నాలుగు రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నెల్లూరులో మత్స్యకారుల సమస్యలపై కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు.
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు.