Sajjala Ramakrishna Reddy: సజ్జల సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం కొరడా
ABN , Publish Date - May 21 , 2025 | 07:23 PM
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

కడప: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలపై ప్రభుత్వానికి కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ నివేదిక అందజేశారు. సజ్జల కుటుంబం ఆక్రమణలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhra Jyothy) వరుస కథనాలతో కూటమి ప్రభుత్వం స్పందించింది. సీకే దిన్నె మండల పరిధిలో 63.39 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు విచారణలో కడప కలెక్టర్ తేల్చారు. సజ్జల కుటుంబం ఆక్రమించిన 55 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ స్వాధీనానికి కడప కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. APMIP, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల సమక్షంలో రేపు(గురువారం) సజ్జల ఎస్టేట్లో భూమిని అధికారులు స్వాధీనం చేసుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News