Home » ABN Andhrajyothy Effect
ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని కాళేశ్వరం కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది.
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Miss World contestants: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. పోటీల్లో భాగంగా పలు ప్రాంతాల్లో అందాల భామలు పర్యటిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
మిస్ కెనడా వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఆ దేశ తొలి ఆదివాసీ తెగ మహిళ. ఎందరో శ్వేతవర్ణ భామలతో పోటీపడి గెలిచిన భూమిబిడ్డ. కేవలం 1,900 మంది జనాభా ఉన్న గ్రామంలో పుట్టారు. అందాల పోటీలని కాకుండా.. ఈ పోటీల్లోనూ ఒక అర్థం, పరమార్ధం ఉందనే ఆలోచనతో ఆ వైపు మళ్లారు.
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తోంది. ఇక్కడి కళలు, సంస్కృతి, వారసత్వ సంపదను విదేశీ అతిథులకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సౌత్మోపూరు గ్రామ అభివృద్ధికి ప్రేరణ ఇచ్చింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గ్రామానికి రూ.1.20 కోట్లు మంజూరు చేసి, రోడ్ల, ప్రహరీ గోడల నిర్మాణం ప్రారంభించారు
హైదరాబాద్ శివారు కుంట్లూర్లో జీవో 59 పేరుతో జరిగిన భూభాగోతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సర్వే నంబర్ 24లో భూమి అక్రమ క్రమబద్ధీకరణపై రెవెన్యూ యంత్రాంగం కదలింది.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పల రవీంద్రరెడ్డిని సిస్కో నుంచి తప్పించారు. ఏపీ కార్యకలాపాల నుంచి ఇప్పల రవీంద్రరెడ్డిని తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సిస్కో అధికారులు సమాచారం పంపించారు. కాగా గతంలో అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి లోకేష్ను కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు.
పత్రాల అప్లోడ్, రుసుం నిర్ధారణలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను సరిదిద్దామని డీటీసీపీ దేవేందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 25 శాతం రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకునేలా దరఖాస్తు ప్రాసెసింగ్ విధానంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.