Home » CM Chandrababu Naidu
వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదు చేసిన సీఐడీ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆయనతోపాటు మిగిలిన నిందితులకు క్లీన్చిట్ ఇచ్చింది.
విశాఖకు 5 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగ్నిజెంట్లో పనిచేసే ఉద్యోగులంతా విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించారు.
విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్ల ఏర్పాటుకు భూమిపూజ జరిగింది.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిందని తెలిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు.
ఏపీ కేబినెట్ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. జగనన్న కాలనీలో గృహాలు నిర్మించని లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. చాలా ప్రాంతాల్లో ఇల్లు నిర్మించకుండా వృధాగా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు.
ఏపీలో చంద్రబాబు పాలనను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.