Home » Sajjala Ramakrishna Reddy
సంకర జాతి అంటూ రాజధాని ప్రాంత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఈ నెల 18 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
YS Sharmila: వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని.. మహిళలను పిశాచులతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు.
Raghurama Vs Sajjala: ఏపీ మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ స్పీకర్ రఘురామ తీవ్రంగా తప్పుబట్టారు. సజ్జలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
అమరావతి మహిళలను అవమానించారని యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఎనలిస్టు కృష్ణంరాజు ఫొటోలను చెప్పులతో కొట్టడం వంటి పనులు సంకరజాతి తెగవారే చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.
రాజధాని మహిళలను సాక్షి మీడియా చర్చ కార్యక్రమంలో కించపరుస్తూ మాట్లాడడంపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సాక్షి మీడియా కార్యాలయాల ఎదుట ప్రజలు ఆందోళనలకు దిగారు.
కడప జిల్లా సీకేదిన్నె మండలం పరిధిలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న భూముల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం పాక్షికంగా సవరించింది.
వైసీపీ నేతలపై టీడీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు సబ్జైల్లో నందిగం సురేశ్ను ములాఖత్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.