Share News

Home Minister Anitha: అమరావతిని నాశనం చేశారు.. జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్

ABN , Publish Date - May 01 , 2025 | 01:59 PM

Home Minister Anitha: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై హోం మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని హోం మంత్రి అనిత మండిపడ్డారు.

Home Minister Anitha: అమరావతిని నాశనం చేశారు.. జగన్‌పై హోం మంత్రి  అనిత ఫైర్
Home Minister Anitha

కృష్ణా: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి వస్తున్నారని తెలిపారు.


కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టిన మళ్లీ తెలుగు దేశం పార్టీకే అధికారాన్ని పట్టం కట్టారని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదగా ప్రారంభమైన అమరావతిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి గురించే పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభ సూచకమని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 02:06 PM