Home » Central Govt
రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తు్న్నాయని, రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.
పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు.
దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే..
ఈ రోజు దేశం మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ నినాదంతో గ్రామగ్రామాన ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రూరల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లఖ్పతి దీదీ ఈ కాన్సెప్ట్స్తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.