Home » Central Govt
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(జూన్15) నుంచి నాలుగు రోజుల పాటు కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే జీ7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
AP Farmers: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కందిపప్పు సేకరణ గడువును మరో 15 రోజులకు పొడిగించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చూసేదెవరని రైలు ప్రమాద ఘటనను ఉద్దేశించి రాహుల్ అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేసిన కృషి సువర్ణాక్షరాలతో లిఖించదగిందని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ఏపీలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. అలాగే జీవ వైవిధ్య పరిరక్షణ, భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందించేందుకు మనమంతా సామూహిక బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు.
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సమూచిత స్థానాన్ని కలిపిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.