Home » Central Govt
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం వెనక్కు తగ్గింది.
బెట్టింగ్ యాప్లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది.
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.
సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.