Home » PM Modi
ఏపీ అభివద్ధిపై వైసీపీ నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హితవు పలికారు. జగన్కి ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. కానీ ఐదేళ్లలో ఏమి చేయలేకపోయారని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్నకు ఇలా ప్రధాని ఫోన్ చేయడంపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఏపీలో చంద్రబాబు పాలనను ప్రధాని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పాలన చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.
ఎన్డీయే విస్తృత ఎజెండా, ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వ ఎజెండాపై ప్రధాని ఈ సమావేశంలో ఎంపీలతో ప్రస్తావిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అంశం కూడా విందు సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ పీఎంఓ కార్యాలయానికి ఒంటిగంట సమయానికి చేరుకున్నారు. 1.07 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానంతరం అత్యున్నత పదవులకు మోదీ ప్రతిపాదించిన పేర్లతో విభేదిస్తున్నట్టు రాహుల్ పేర్కొంటూ లిఖితపూర్వకంగా తన అసమ్మతి నోట్ను అందజేశారు.
సీఐసీలోని టాప్ పోస్టుల ఎంపికకు పీఎం సారథ్యంలోని కమిటీ బుధవారంనాడు సమావేశమవుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇటీవల తెలియజేసింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 12(3) కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ నియామకాలకు పేర్లను ఈ కమిటీ ఎంపిక చేసి తమ సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతుంది.
ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. వందే మాతరం జాతీయ గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతోంది. సభల్లో జరిగే అంశాలన్నీ ఇక్కడ మీకోసం..
కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.