Home » Amaravati
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.
నాయీ బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల వారీ భృతిని రూ. 20 వేల నుంచి రూ. 25 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44 దేవాలయాలకు ఈ జీవో వర్తించనుంది.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని అభివృద్ధికి అదనపు భూసమీకరణ అవసరమని, భూదరాలు తగ్గవని భరోసా ఇచ్చారు.
మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల రాకపోకలు, భద్రత, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Amaravati Farmers: అమరావతి రైతులతో ఉండవల్లి నివాసంలో సమావేశం అయ్యారు. వారితో పలు కీలక విషయాల గురించి చర్చించారు. ప్రధాని రాక నేపథ్యంలో రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. విధ్వంసం నుంచి రైతులు అమరావతిని కాపాడరంటూ ప్రశంసించారు.
మే 2న ప్రధాని మోదీ అమరావతికి వస్తున్నారని, ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని, ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేదని, ఇప్పుడు...
మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.
ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైపీపీ ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం రండు వారాలపాటు వాయిదా వేసింది.
గుంటూరు మేయర్గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుపొందరు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్య ర్థి పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవం అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటిలో నిలిచారు. దీంతో ఎన్నిక జరగ్గా.. కూటమి అభ్యర్థి విజయం సాధించారు.