Home » Amaravati
చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ (శుక్రవారం ఆగస్టు1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో మంగళవారం రాత్రి ఏనుగులు హల్చల్ చేశాయి. రాత్రి 8.30 గంటలకు 11 ఏనుగులు ఈ మార్గంలోని పంప్ హౌస్, మయూర డైరీ ఫామ్, శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, సత్యసాయి ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతూ భయాందోళన కలిగించాయి.
ఒకప్పుడు సమాజాన్ని ప్రభావితం చేసిన నేతల బొమ్మలతో యువత టీ షర్టులు వేసుకునేవారు. ఆ తర్వాత కొటేషన్లు.. క్రమేణా తమ అభిమాన సినీ హీరోలు, రాజకీయ నేతల చిత్రాలతో టీ షర్టులు ధరిస్తూ వచ్చారు. ఇలా తమ అభిమానం చూపుకొనే వారు.
శేషాచల అడవుల్లోని ప్రకృతి అందాలను బాహ్యప్రపంచానికి వెబ్పేజీ ద్వారా చూపుతున్న తనను టార్గెట్ చేసి పుత్తూరు అటవీశాఖ కార్యాలయంలో అక్రమంగా నిర్బంధించారని వైల్డ్లైఫ్ అండ్ మాక్రో ఫొటోగ్రాఫర్ సిద్థార్థ ఆరోపించారు.
ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. కొత్త నగరం నిర్మాణం అనేది మంచి అవకాశమని, ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని వివరించారు. సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ.. నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఇంతవరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి
క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవ్వరూ క్వాంటమ్ గురించి మాట్లాడనప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్లు నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి రైల్వే లైన్కు భూములివ్వటానికి తాము సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. అయితే ఎంత నష్ట పరిహారం ఇస్తారు, భూ సమీకరణలో భూములు తీసుకుంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడిస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని అమరావతి రైతులు కోరారు.
రెండో విడత ల్యాండ్ పూలింగ్పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ల్యాండ్ పూలింగ్పై వచ్చే కేబినెట్లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.
ప్రజలను మోసం చేసి మద్యం కుంభకోణంలో జగన్ దోచుకున్న రూ.3500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూటమి ప్రభుత్వానికి సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టం లేదా కొత్త చట్టం తీసుకొచ్చి జగన్ కాజేసిన సొమ్మును ప్రభుత్వం వసూలు చేయాలని అన్నారు.