Home » Amaravati farmers
రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరకు కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్ విష ప్రచారం చేస్తూ, పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. . ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవని చెప్పారు.
రాజధాని రైతుల మనోభావాలను దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా వ్యవహరించడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. కృష్ణంరాజుపై వెంటనే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వడ్డే శోభనాద్రీశ్వర రావు ప్రభుత్వాన్ని కోరారు.
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.
రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని రాజధాని అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్లో కృష్ణంరాజు అనే వ్యక్తి నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. అమరావతిపై ఏవరూ కూడా ఇలా వ్యాఖ్యలు చేయరని చెప్పారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీవీఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ఫొటోలను చెప్పులతో కొట్టారు ఏపీ మహిళలు. సాక్షి ఛానల్లో ప్రసారమైన 'లైవ్ విత్ కేఎస్ఆర్' డిబేట్లో..
Minister Lokesh: అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని మంత్రి లోకేష్ అన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అంటూ మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కలిగించాలి.
రాయితీ విత్తనాల పంపిణీలో ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో నిధులు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ విడుదల చేయక పోవడం, పాత బకాయిల వల్ల సరఫరాదారుల అసహకారం తలెత్తింది.