CM Chandrababu: సీఎం చంద్రబాబుతో కేంద్రబృందం భేటీ.. ఎందుకంటే
ABN , Publish Date - May 13 , 2025 | 09:24 AM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు బిజీ బిజీగా ఉండనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అలాగే ఏపీ సచివాలయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

అమరావతి: ఏపీకి కేంద్రబృందం ఇవాళ(మంగళవారం) రానున్నారు. సీఎం చంద్రబాబుతో (CM Chandrababu) కేంద్రబృందం సమావేశం కానున్నారు. ఏపీలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో మాట్లాడనున్నారు. దుగరాజపట్నంలో నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై చర్చించనున్నారు. అలాగే ఇవాళ(మే13) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈమేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది.
ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు ఏపీ సచివాలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 12.00 గంటలకు ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 03.45 గంటలకు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్షించనున్నారు. సాయంత్రం 06.30 గంటలకు సచివాలయం నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. 07.00 గంటలకు చీఫ్ జస్టిస్తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. 07.40 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోనున్నారు.
15న అనంతపురం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
ఈనెల 15వ తేదీన అనంతపురం జిల్లాలోని గుత్తి మండలంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పర్యటించనున్నారు. బేతపల్లి గ్రామంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. గుత్తిలోని ఓ ప్రైవేట్ కళాశాల వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలకు ఆయా అంశాలపై మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Police Society Scam: భారీగా నిధుల దుర్వినియోగం.. బయటపడ్డ స్కాం
Gangamma Jatara: చిత్తూరులో ప్రారంభమైన గంగమ్మ జాతర వేడుకలు
Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..
Sajjala Sridhar Reddy: సజ్జలను కస్టడీకి ఇవ్వండి
Nimmala Ramanaidu: నెలాఖరులోగా కాలువల మరమ్మతులు
For More AP News and Telugu News