Home » AP Secretariat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ మంత్రి మండలి సమావేశం గురువారం జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని.. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.
పేదలకు ఇళ్లు ఇవ్వకుండా జగన్ హయాంలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని పేదలకి కూడా తమ ప్రభుత్వం సాయం చేస్తోందని భరోసా కల్పించారు.
భూ సంస్కరణలపై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
రాబోయే రోజుల్లో ఏవియేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని మంత్రి జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. ఏపీలో ఏవియేషన్ రంగంలో ఆయా సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంపై మంత్రి జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయకపోతే ఫలితాలు రావని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికత పెరిగిన దృష్ట్యా స్మార్ట్ వర్క్ చేయాల్సిందేనని ఆదేశించారు. ఏఐ, డేటా లేక్ వంటి వాటి ద్వారా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా మంత్రి మండలి చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉఫసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అధారిటీలో ఆమోదముద్ర వేశామని మంత్రి నారాయణ తెలిపారు. వీటిని ఈనెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.