Home » Anantapur
Tension In Tadipatri: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జేసీ ఇంటికి చేరుకుంటున్నారు.
మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.
మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది.
Girls Safety: అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, కాలం బాగోలేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన రెండు ఘటనలపై శైలజ స్పందించారు.
Inter student Case: అనంతలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన్మయిని ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని నిందితుడు నరేష్ పోలీసులకు తెలిపాడు.
Student case: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Minister Nara Lokesh: అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య తనను షాక్కు గురిచేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.