కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రజలను చైతన్యం చేయడంలో సీపీఐ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నది కానీ నక్సలైట్లతో చర్చలకి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నల వర్షం కురిపించారు.
Medak Syrup Tragedy: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు తల్లి సిరప్ తాగించింది. ఆ వెంటనే ఆ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.
ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ నాయకులు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు.
అందాల పోటీలు పెట్టీ ఇంగ్లాండ్ అమ్మాయిని రేవంత్ దోస్తులు ఇబ్బంది పెట్టితే ఆమె పారిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళల పట్ల రేవంత్ రెడ్డి దోస్తులు అనుచితంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు.
BRS: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.