Home » RJD
తేజ్ ప్రతాప్ తన పోస్ట్లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.
రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసినా ఆ విషయం దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని ఐశ్వర్యారాయ్ ఆరోపించారు. తనను కొట్టి, వేధింపులకు పాల్పడినప్పుడు, గృహహింస చేసినప్పుడు లాలూ చెబుతున్న సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడం, ఆయనపై ఇతర వివాదాలు కూడా ఉండటంతో లాలూ తాజా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు మనోజ్ ఝా చెప్పారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తామని, ఎన్డీయేను ఓడిస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)తో తిరిగి చెలిమికి ఆర్జేడీ మంతనాలు సాగిస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆర్జేడీ నేత నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆదివారంనాడు ఘాటు సమాధానం ఇచ్చారు.
ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఓవైపు సమావేశానికి సన్నాహకాలు జరుగుతుండగా, లాలూ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై భారతీయ జనతా పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని తేజస్వి ఖాళీ చేసే సమయంలో అనేక వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలింది. 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10స్థానాల్లో గెలుపొందగా, ఎన్డీయే కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.