Home » Nagarjuna Sagar
శ్రీశైలంతో పాటు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను పరిశీలించడానికి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) సమ్మతి తెలిపింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పలు కీలక సూచనలు చేసింది. ప్రాజెక్టు గేట్ల, స్పిల్వే, సీపేజీలకు సంబంధించి మరమ్మత్తులు మరియు సమగ్ర పరిశీలన చేపట్టాలని సూచించింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద 2023 నవంబరు 29వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించే అంశంపై చర్చించడానికి త్వరలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలతో సమావేశం కానుంది.
నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఇక నుంచి ఒక సీఆర్పీఎఫ్ బెటాలియన్కే పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
కేంద్రం నిర్ణయం ప్రకారం, నాగార్జున సాగర్ డ్యామ్ రక్షణ బాధ్యతను ఒక్క సీఆర్పీఎఫ్ బెటాలియన్ (విశాఖ)కి అప్పగించారు. ములుగు బెటాలియన్ను ఉపసంహరించగా, ఎస్పీఎఫ్ బలగాలు కూడా కాపలా ఉంటాయి
నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై సీఆర్పీఎఫ్ సిబ్బంది మధ్య గందరగోళం ఏర్పడింది. తెలంగాణ మరియు ఏపీ వైపు పహారా కాస్తున్న బలగాలకు వెనక్కి రావాలని ఆదేశాలు అందినా తిరిగి వెళ్లేందుకు సిబ్బంది సిద్ధమవుతున్నారు
శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 38.10 మీటర్లు కాగా.. ప్రస్తుతం 35.45 మీటర్లు ఉంది. ఒడిశా కొండల నుంచి(క్యాచ్మెంట్ ఏరియా) 30 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది.
ఉన్న నీటి నిల్వలను మే, జూన్ వరకు ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలో ఆంధ్ర, తెలంగాణ చీఫ్ ఇంజనీర్ల కమిటీ నిర్ధారించింది.
రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల వినియోగంలో తొలుత తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఆ తర్వాతే సాగునీటి కోసం వినియోగించాలంది.
నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని.. వాస్తవిక సాగు, తాగు నీటి అవసరాలను అంచనా వేయాలని, పరస్పర అంగీకారంతో రాజీ మార్గంలో నడవాలని తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి.